కేసీఆర్ కుటుంబంలోనే ప్రగతి కనిపిస్తోంది
తెలంగాణలో ప్రగతి కేసీఆర్ కుటుంబంలో మాత్రమే కనిపిస్తోందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ బన్సల్ ఆరోపించారు.
భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ బన్సల్
కమ్మర్పల్లి, న్యూస్టుడే: తెలంగాణలో ప్రగతి కేసీఆర్ కుటుంబంలో మాత్రమే కనిపిస్తోందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ బన్సల్ ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లిలో బాల్కొండ నియోజకవర్గ భాజపా సీనియర్ కార్యకర్తలతో సోమవారం నిర్వహించిన ‘జన్ సంపర్క్ అభియాన్’లో ఆయన మాట్లాడుతూ... ‘‘మొదట్లో రెండు ఎంపీ సీట్లే ఉన్న భాజపా ప్రస్తుతం 300కు పైగా సీట్లు సాధించి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అంకితభావమున్న కార్యకర్తల కృషియే కారణం. ఈ తొమ్మిదేళ్లలో ప్రధాని మోదీ సాధించిన విజయాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి’’అని సూచించారు. అనంతరం ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ... అయోధ్యలో ఆలయ ప్రారంభోత్సవం తర్వాత నాటి కరసేవకులను అక్కడికి తీసుకెళ్లి శ్రీరాముడి దర్శనభాగ్యం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు పల్లె గంగారెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, ఏలేటి మల్లికార్జున్రెడ్డి, భూపతిరెడ్డి, రుయ్యాడి రాజేశ్వర్ పాల్గొన్నారు.
రాహుల్వి పగటి కలలు: ఇంద్రసేనారెడ్డి
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో భాజపాను కనుమరుగు చేస్తామంటూ కాంగ్రెస్ నేత రాహుల్ పగటి కలలు కంటున్నారని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎన్.ఇంద్రసేనారెడ్డి అన్నారు. సోమవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ... సొంతంగా కనుమరుగయ్యే ఆ పార్టీ భాజపా గురించి మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్కు లోక్సభలో ప్రతిపక్ష హోదా కూడా లేని విషయాన్ని మరవొద్దని సూచించారు. తెలంగాణలో కాంగ్రెస్, భారాస, వామపక్షాలు కలసి పోటీ చేసినా భాజపా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్