దళిత మహిళను దారుణంగా హత్య చేస్తే ఇంత బాధ్యతారాహిత్యమా?
ప్రకాశం జిల్లా, టంగుటూరు మండలంలో హనుమాయమ్మ అనే ఎస్సీ మహిళను వైకాపా నాయకుల మద్దతుతో ట్రాక్టర్తో తొక్కించి దారుణంగా హత్య చేస్తే... ఇంత బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తారా? అని డీజీపీ రాజేంద్రనాథరెడ్డిపై తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపడ్డారు.
డీజీపీ ప్రకటనపై తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజం
ఈనాడు డిజిటల్, అమరావతి : ప్రకాశం జిల్లా, టంగుటూరు మండలంలో హనుమాయమ్మ అనే ఎస్సీ మహిళను వైకాపా నాయకుల మద్దతుతో ట్రాక్టర్తో తొక్కించి దారుణంగా హత్య చేస్తే... ఇంత బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తారా? అని డీజీపీ రాజేంద్రనాథరెడ్డిపై తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపడ్డారు. దర్యాప్తు ఏం జరిగింది? నిందితులెవరు? వారిని ఎప్పుడు అరెస్టు చేస్తారు? వారిని ప్రోత్సహించిందెవరు? అధికార పార్టీ నాయకుల పాత్రేంటి? ఎందుకంత కక్షపూరితంగా చంపారు? పోలీసుల ప్రణాళిక ఏంటి? అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా డీజీపీ బుధవారం విడుదల చేసిన పత్రికాప్రకటన బాధ్యతారాహిత్యంగా ఉందని మండిపడ్డారు. ఇది హత్యకేసు, పోలీసులు అరెస్టు చేస్తారు, అరెస్టు చేసినప్పుడు వారిని రిమాండ్కు పంపుతారు.. అంటూ ప్రకటనలో పేర్కొనడం డీజీపీ ఫ్యూడల్ మనస్తత్వానికి నిదర్శనమని బుధవారం ఓ ప్రకటనలో వర్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మిషన్లో చెరుకుగడ నలగగొట్టినట్టు ఓ ఎస్సీ మహిళను ట్రాక్టర్తో తొక్కించి చంపితే డీజీపీ ఆయన హోదా, స్థాయికి తగని రీతిలో స్పందించారు. ఈ ప్రభుత్వంలో దళితుల స్థానం, ప్రభుత్వ పరంగా వారి ప్రాధాన్యత ఏంటో ఆయన ఇచ్చిన పత్రికా ప్రకటనతో స్పష్టమైంది. ఎస్సీ మహిళ హత్య కేసును సరిగా దర్యాప్తు చేయని అధికారులు కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం ప్రకారం నేరస్థులని ఆయన గ్రహించాలి. ఈ కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలి. మృతురాలి కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలి...’’ అని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.
నిందితులను కాపాడుతున్నారు: కేఎస్ జవహర్
ప్రకాశం జిల్లాలో దళిత మహిళ హనుమాయమ్మను వైకాపా నేత ట్రాక్టర్తో తొక్కి చంపడం రాష్ట్రంలో దళితుల పరిస్థితికి అద్దం పడుతోందని మాజీ మంత్రి కేఎస్ జవహర్ మండిపడ్డారు. ప్రాణాలు తీసే వారంతా వైకాపాలోనే ఉన్నారని.. జగన్ నిందితులను కాపాడుతున్నారని బుధవారం ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు