ఏపీ నేతలకు మాటలెక్కువ.. పని తక్కువ
ఏపీ నేతల మాటలు కోటలు దాటుతాయని, చేతలు మాత్రం తక్కువని మంత్రి హరీశ్రావు ఆరోపించారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్లో శనివారం ఏర్పాటు చేసిన సుపరిపాలన దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఇద్దరు నాయకుల తీరుతో బోర్లా పడిన ఆ రాష్ట్రం
తెలంగాణ ప్రజలు తలెత్తుకునేలా కేసీఆర్ పాలన
మంత్రి హరీశ్రావు వ్యాఖ్యలు
సంగారెడ్డి టౌన్, కొండాపూర్, న్యూస్టుడే: ఏపీ నేతల మాటలు కోటలు దాటుతాయని, చేతలు మాత్రం తక్కువని మంత్రి హరీశ్రావు ఆరోపించారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్లో శనివారం ఏర్పాటు చేసిన సుపరిపాలన దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏపీకి చెందిన ఇద్దరు నేతల తీరు కారణంగా ఆ రాష్ట్రం ఇప్పుడు బోర్లా పడిందని ఎద్దేవా చేశారు. ఓ నేత తనను తాను దేశంలో ఉత్తమ అడ్మినిస్ట్రేటర్గా, హైటెక్ నేతగా చెప్పుకొనేవారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ మాటలు తక్కువ మాట్లాడుతూ.. చేతల్లో దేశానికే ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించి తప్పుచేశానని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించినట్లు తాను విన్నానని, అప్పుడు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వారు ఇప్పుడు బాధపడుతున్నారని తెలిపారు.
‘‘తెలంగాణ ఏర్పడితే చీకట్లే మిగులుతాయని, నక్సలైట్ల రాజ్యం వస్తుందని, హైదరాబాద్లో నిత్యం కర్ఫ్యూ ఉంటుందన్న వారి మాటలు పూర్తి అవాస్తవమని కేసీఆర్ 9 ఏళ్ల పాలనలో నిరూపించారు. రాష్ట్ర ప్రజలు తల ఎత్తుకునేలా చేశారు. పైసా లంచం లేకుండా ఇప్పటివరకు 60 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతుబంధు పథకంతో రూ.60 వేల కోట్లు జమయ్యాయి. ధరణి వల్లే ఇది సాధ్యమవుతోంది’’ అని హరీశ్రావు తెలిపారు. దివ్యాంగులకు పింఛను పెంపు ప్రకటనను హర్షిస్తూ.. సీఎం కేసీఆర్ చిత్రపటానికి దివ్యాంగులతో కలిసి హరీశ్రావు పాలాభిషేకం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్