Karnataka Politics: కర్ణాటక రాజకీయాల్లో కొత్త పొత్తులు!
కర్ణాటక రాజకీయాల్లో పాత మిత్రులు మళ్లీ ఏకమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటీవలి విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించి అధికారాన్ని చేపట్టింది.
ఎన్డీయేలోకి జేడీఎస్?
ఈనాడు, బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో పాత మిత్రులు మళ్లీ ఏకమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటీవలి విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించి అధికారాన్ని చేపట్టింది. రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను వెనక్కి నెట్టడానికి మిగిలిన రెండు విపక్షాలైన భాజపా, జేడీఎస్ ఒక్కటయ్యే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. జాతీయస్థాయిలో ఈ నెల 18న ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో నిర్వహించే ఎన్డీయే మిత్రపక్షాల సమావేశంలో ఈ అంశంపై కీలక ప్రకటన చేస్తారని జేడీఎస్ వర్గాలు వెల్లడించాయి. విధానసభలోనూ ఎన్డీయే విపక్షపాత్ర పోషించనుంది.
‘కుమార’ సారథ్యం
కర్ణాటక విధానసభ ఎన్నికల ఫలితాలు వెల్లడై రెండు నెలలు దాటి, శాసనసభ సమావేశాలు మొదలయ్యాయి. ఇప్పటివరకు రెండో అతిపెద్ద పార్టీ- భాజపా విపక్ష నేతను ఎన్నుకోలేదు. ఈ ఆలస్యం వెనుక కొత్త రాజకీయ సమీకరణం ఉండొచ్చని స్పష్టమవుతోంది. ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్ సమావేశాల్లో జేడీఎస్ శాసనసభా పక్షనేత కుమారస్వామి మాట్లాడుతూ తమ పార్టీ ఉనికిని కాపాడుకోవాలంటే పొత్తులు తప్పవని తేల్చిచెప్పారు. చర్చల సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ ‘జేడీఎస్ నేడు భాజపా బీ-టీమ్’ అంటూ వ్యాఖ్యానించగా ఇందుకు బదులిచ్చిన కుమారస్వామి ‘మీవల్లే మేము ఒక్కటి కావాల్సి వస్తోంది’ అంటూ బదులిచ్చారు. 2018 ఎన్నికల తర్వాత ప్రధాని మోదీ స్వయంగా తమతో కలసి సాగాలని ఆహ్వానించినట్లు కుమారస్వామి వెల్లడించారు. అప్పట్లోనే ప్రధాని మాట విని ఉంటే తాను ఐదేళ్లపాటు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగేవాడినన్నారు. కాంగ్రెస్తో కలసి తప్పుచేశానని చెప్పారు.
* సోమవారం దిల్లీకి వెళ్లనున్న కుమారస్వామి ప్రధానమంత్రితో ప్రత్యేకంగా చర్చించనున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీచేసేందుకు నిర్ణయించగానే విధానసభలోనూ భాజపా, జేడీఎస్ల కూటమి ఏర్పాటుకానుంది. ఈ కూటమికి కుమారస్వామి నాయకత్వ బాధ్యతలు చేపట్టి విధానసభ విపక్ష నేతగా వ్యవహరించే అవకాశాలున్నట్లు జేడీఎస్ పార్టీవర్గాలు తెలిపాయి. త్వరలో జరగనున్న కేంద్ర మంత్రివర్గ విస్తరణలో జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు చోటిచ్చే దిశగా చర్చలు కొనసాగుతున్నాయి. ఇటీవలి కర్ణాటక విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్ 135 స్థానాల్లో గెలుపొందగా, భాజపా 66, జేడీఎస్ 19 స్థానాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాయావతి కీలక ప్రకటన.. వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ తొలగింపు
Mayawati: డిసెంబర్లో తన రాజకీయ వారసుడిగా మాయావతి తన మేనల్లుడైన ఆకాశ్ ఆనంద్ను ప్రకటించారు. తాజాగా కీలక బాధ్యతల నుంచి ఆయన్ని తొలగిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టం.. రైతుల భూముల్ని కొల్లగొట్టేందుకే
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని దొడ్డిదారిన అమలు చేసేందుకు సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని ఎన్డీయే నేతలు విమర్శించారు. -
ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు?
ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్కుమార్కు చేదు అనుభవం ఎదురైంది. -
నూర్బాషాల సంక్షేమానికి కూటమి మ్యానిఫెస్టోలో రూ.100 కోట్లు కేటాయిస్తామనడం హర్షనీయం
నూర్బాషాల సంక్షేమానికి రూ.వంద కోట్లు కేటాయిస్తామని తెదేపా, జనసేన మ్యానిఫెస్టోలో చెప్పడం హర్షనీయమని తెదేపా నూర్ బాషా నాయకులు నాగుల్మీరా, పీర్ మహ్మద్బుజ్జి, షేక్ సుభాని, నాగుల్ అన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులకు ఉరితాడే
రాష్ట్రంలోని ఇసుక, గనులతో పాటు అన్ని సహజవనరులను దోచుకున్న సీఎం జగన్ ఇప్పుడు ప్రజల ఆస్తులపై కన్నేశారని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి ధ్వజమెత్తారు. -
హరియాణా రాజకీయాల్లో కలకలం
హరియాణాలో అధికార భాజపా ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని ప్రభుత్వానికి తాము మద్దతు ఉపసంహరిస్తున్నట్లు ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యులు మంగళవారం ప్రకటించారు. -
అయిదో రోజు మరో ఏడుగురు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వంలో ఐదో రోజు మంగళవారం మరో ఏడుగురు అభ్యర్థులు కొత్తగా నామినేషన్ వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రెడ్లైన్ దాటుతున్నారు జాగ్రత్త..!’ - కెనడాలోని సిక్కు వేర్పాటువాదులకు భారత్ హెచ్చరిక
-
AI ఫీచర్లు, 64MP కెమెరాతో గూగుల్ పిక్సెల్ 8ఏ.. ధర, ఫీచర్లివే
-
యూకే ఎయిర్ పోర్టుల్లో రాత్రంతా నిలిచిపోయిన ఈ-గేట్లు.. ప్రయాణికుల అవస్థలు!
-
₹2.5కోట్లు ఇస్తే ఈవీఎం మార్చేస్తా.. రాజకీయ నేతను డిమాండ్ చేసిన ఆర్మీ జవాన్
-
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. రిప్లై ఇచ్చిన ‘దేవర’ భామ
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఉద్యోగుల మూకుమ్మడి సెలవు.. 80కి పైగా విమానాల రద్దు