Balineni: మాగుంట రాఘవరెడ్డిపై కుట్ర.. వైకాపా అండగా నిలవాలి: బాలినేని
‘ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి తనయుడు రాఘవరెడ్డిపై కొందరు కుట్ర చేశారు. దిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆయనను ఇరికించారు.
ఒంగోలు నేరవిభాగం, న్యూస్టుడే: ‘ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి తనయుడు రాఘవరెడ్డిపై కొందరు కుట్ర చేశారు. దిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆయనను ఇరికించారు. రాఘవరెడ్డి ప్రజల్లోకి రావాలి. ప్రకాశంజిల్లా రాజకీయాల్లో తనవంతు పాత్ర పోషించాలి. ఇటువంటి తరుణంలో ఆ కుటుంబానికి వైకాపా శ్రేణులు అండగా నిలవాల్సిన అవసరం ఉంది’ అని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. దిల్లీ లిక్కర్ కుంభకోణంలో కొన్నినెలల పాటు తిహార్ జైలులో ఉన్న మాగుంట రాఘవరెడ్డికి ఇటీవల బెయిల్ లభించింది. జైలు నుంచి విడుదలైన ఆయన తొలిసారిగా గురువారం ప్రకాశం జిల్లాకు వచ్చారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేనిని మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ మాగుంట కుటుంబం గత నలభై, యాభై ఏళ్లుగా మద్యం వ్యాపారంలోనే ఉందని.. వారిపై ఇప్పటివరకు ఎలాంటి ఆరోపణలూ లేవన్నారు. భేటీలో బాలినేని ప్రణీత్రెడ్డి, సూపర్బజార్ ఛైర్మన్ తాతా ప్రసాద్ తదితరులున్నారు. రాఘవరెడ్డికి వల్లూరమ్మ దేవస్థానం వద్ద వైకాపా శ్రేణులు పూలతో స్వాగతం పలికారు. గజమాలలతో ఎంపీ మాగుంట, రాఘవరెడ్డిలను సత్కరించారు. ఆ తరవాత వారు ప్రదర్శనగా ఒంగోలులోని నివాసానికి చేరుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని రాజంపేట లోక్సభ కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
నాలుగు నెలల్లో 6 గ్యారంటీల్లో చేయాల్సినవి అమలు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి హల్చల్..
ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో శనివారం అర్ధరాత్రి వైకాపా నేతలు దౌర్జన్యం చేశారు. -
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
-
వెంకటగిరిలో జగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!