Balineni Srinivasa Reddy: అవి లంచాలు కాదు.. పార్టీ ఫండ్గా ఇచ్చారు
‘‘మాది తాతల కాలం నుంచే బాగా ఆస్తులున్న కుటుంబం. ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో చాలావరకు భూములను పేదలకు రాసిచ్చిన చరిత్ర మాది.
తెదేపా నేతల వద్దే రూ. 15 కోట్లు అప్పు తీసుకున్నా
ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి
ఒంగోలు నేర విభాగం, న్యూస్టుడే: ‘‘మాది తాతల కాలం నుంచే బాగా ఆస్తులున్న కుటుంబం. ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో చాలావరకు భూములను పేదలకు రాసిచ్చిన చరిత్ర మాది. నా దగ్గర పది రూపాయలుంటే, మరో రూ. 20 అప్పు చేసి మరీ పేదలకు ఇచ్చే గుణం నాది. అలాంటి నాపై ప్రతిపక్షాలు అనవసర విమర్శలు చేస్తున్నాయి. నేను మంత్రిగా ఉన్నప్పుడు పార్టీ ఫండ్ కోసం ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకున్నానే తప్ప... లంచం కాదు. ఎక్కడా అవినీతికి పాల్పడలేదు’’ అని మాజీమంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) వ్యాఖ్యానించారు. మంత్రిగా కొందరి వద్ద డబ్బులు తీసుకున్నానంటూ ఒంగోలులో శనివారం చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో నష్టనివారణ చర్యలు చేపట్టిన బాలినేని.. ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. సీఎం జగన్ పట్ల విధేయతను ప్రకటించారు.
అయిదుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేసిన తాను తాతలు, తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులనూ అమ్మేయాల్సి వచ్చిందని... ప్రస్తుతం రూ. 15 కోట్ల అప్పులు ఉన్నాయని, అవి కూడా తెదేపా వారి నుంచే తీసుకున్నానని చెప్పారు. తెదేపా, జనసేన.. బురదజల్లే కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. తుపాను బాధితుల పరామర్శకు సీఎం జగన్ హెలికాప్టర్లో వచ్చారని పత్రికల్లో రాస్తున్నారని.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సైకిల్పై వచ్చి బాధితుల్ని పరామర్శించారా అని ప్రశ్నించారు. తుపాను నేపథ్యంలో సీఎం జగన్ అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసి.. ముందుగా నిధులు ఇవ్వడంతోనే విపత్తును సమర్థంగా ఎదుర్కొన్నట్లు చెప్పారు. తన కోసం కార్యకర్తలు సక్రమంగా పనిచేయడం లేదన్న వ్యాఖ్యలు.. అధికారంలో ఉన్నామన్న నిర్లక్ష్యం విడనాడాలని చేసినవి మాత్రమేనని తెలిపారు. ఈ వ్యాఖ్యలతో కార్యకర్తలు ఇబ్బంది పడటం తనను బాధించిందన్నారు. వచ్చే ఎన్నికల్లో 2019 ఎన్నికలకు మించిన మెజారిటీతో తాను గెలుస్తానని.. జగన్ మళ్లీ సీఎం అవుతారని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. ప్రజల భూములు కొట్టేసే నల్ల చట్టమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. -
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. -
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
పాఠ్య పుస్తకాల అప్డేషన్పై NCERTకి కేంద్రం కీలక సూచన!