కిసాన్ మోర్చా జాతీయ ఇన్ఛార్జిగా బండి సంజయ్
భారతీయ కిసాన్ మోర్చా ఇన్ఛార్జిగా కరీంనగర్ ఎంపీ, భాజపా ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ నియమితులయ్యారు.
ఈనాడు, దిల్లీ: భారతీయ కిసాన్ మోర్చా ఇన్ఛార్జిగా కరీంనగర్ ఎంపీ, భాజపా ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ నియమితులయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు మొత్తం 7 పార్టీ అనుబంధ విభాగాలకు కొత్త ఇన్ఛార్జిలను నియమిస్తూ పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇందులో మహిళా మోర్చా ఇన్ఛార్జిగా పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్పాండాను నియమించారు. పార్టీ ప్రధాన కార్యదర్శుల్లో యువ మోర్చా ఇన్ఛార్జిగా సునీల్ బన్సల్, ఎస్సీ మోర్చా ఇన్ఛార్జిగా తరుణ్చుగ్, ఎస్టీ మోర్చా ఇన్ఛార్జిగా రాధా మోహన్ దాస్ అగర్వాల్, ఓబీసీ మోర్చా ఇన్ఛార్జిగా వినోద్ తావ్డే, మైనార్టీ మోర్చా ఇన్ఛార్జిగా దుశ్యంత్కుమార్ గౌతమ్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. తెలంగాణ అధ్యక్ష బాధ్యతలనుంచి తప్పించిన తర్వాత బండి సంజయ్కు జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్ఠానం ఇప్పుడు కీలకమైన కిసాన్మోర్చా ఇన్ఛార్జిగా నియమించింది.
అయోధ్య రామయ్య దర్శనానికి ప్రజల ఎదురుచూపు
కార్ఖానా, న్యూస్టుడే: అయోధ్య రామయ్య దర్శనానికి దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ తెలిపారు. బోయిన్పల్లిలో అయోధ్య రామాలయ ద్వారాలు తయారు చేస్తున్న అనూరాధ టింబర్ డిపోను బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా డిపో నిర్వాహకులు చదలవాడ తిరుపతిరావు, కిరణ్కుమార్ను సత్కరించారు. అనంతరం సంజయ్ మాట్లాడుతూ..రామాలయ నిర్మాణాన్ని అయోధ్యలోని ముస్లిం సంఘాలు స్వాగతించాయని, ఒవైసీ మాత్రం కోర్టు తీర్పును తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి ఫిర్యాదు చేసినా తమకు అభ్యంతరం లేదని పేర్కొన్నారు. అహంకారంతోనే భారాస అధికారం కోల్పోయిందని, కాంగ్రెస్ నేతలు కూడా అలాగే వ్యవహరిస్తే వారికీ అదే గతి పడుతుందని తెలిపారు. కరీంనగర్లో గోమాతను వధించి నూతన సంవత్సర విందు చేసుకున్న నిందితులను ప్రజల సమక్షంలో బహిరంగంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా, వైకాపా శ్రేణుల ఘర్షణ.. కుంకలగుంటలో పోలీసుల బందోబస్తు
జిల్లాలోని నకరికల్లు మండలం కుంకలగుంటలో తెదేపా, వైకాపా శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. -
సైనీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు మద్దతిస్తాం
హరియాణాలో ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు భూపీందర్సింగ్ హుడా చర్యలు చేపడితే తమ పార్టీ మద్దతిస్తుందని మాజీ ఉప ముఖ్యమంత్రి, జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) నాయకుడు దుశ్యంత్ చౌటాలా తెలిపారు. -
నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం గురువారంతో ముగియనుంది. -
భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రేమేందర్రెడ్డి
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు భాజపా అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్రెడ్డి బరిలో నిలవనున్నారు. -
కాంగ్రెస్లోకి పద్మశ్రీ గ్రహీత గజం గోవర్ధన్
పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం గోవర్ధన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు అఖిలభారత పద్మశాలి అన్నసత్రం భద్రాచలం అధ్యక్షుడు గోశిక యాదగిరి, తెలంగాణ పద్మశాలి సంఘం కార్యదర్శి నారా నరసింహా, ఆప్కో మాజీ డైరెక్టర్ గోశిక పాండులు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత క్రికెట్లో అభిషేక్ ఓ అద్భుతం.. సంచలనాలు సృష్టిస్తాడు: ట్రావిస్ హెడ్
-
షికాగోలో తెలంగాణ విద్యార్థి అదృశ్యం..
-
పన్నూ హత్యకు కుట్ర కేసు.. అమెరికా ఆరోపణల వేళ భారత్కు రష్యా మద్దతు
-
చిరు టు మహేశ్.. తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ రోజెంతో ప్రత్యేకం..!
-
నష్టాల్లోనే స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,271
-
10 ఓవర్లలోపే విజయం.. నమ్మలేకపోతున్నా: కెప్టెన్ కమిన్స్