సొమ్ము జనానిది.. బొమ్మ జగన్ది!
కోడిగుడ్లు, రాగిపిండి, పల్లీచిక్కి.. కాదేదీ జగన్ బొమ్మకు అనర్హం! ఇదేదో కవిత్వం అనుకునేరు. శ్రుతిమించిన జగన్ ప్రచార పైత్యం! ప్రజలు కష్టపడి కట్టుకున్న ఇళ్లు.. అప్పుచేసి కొనుక్కున్న స్థలాలు.. వారసత్వంగా వచ్చిన పొలాలు.. ఇలా ఏదైనా ఆయనకు అనవసరం.
పథకం, భవనం ఏదైనా ‘ముద్ర’ పడాల్సిందే
ప్రచారాలపై శ్రద్ధ.. పాలనలో మొద్దునిద్ర
వైకాపా పైత్యానికి రూ.5 వేల కోట్ల ప్రజాధనం ఆవిరి
ఇళ్లు, స్థలాలు, శ్మశానాలనూ వదల్లేదు
పాసుపుస్తకాలు, భూహక్కులు, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలోనూ..
కోడిగుడ్లు, రాగిపిండి, పల్లీచిక్కి.. కాదేదీ జగన్ బొమ్మకు అనర్హం! ఇదేదో కవిత్వం అనుకునేరు. శ్రుతిమించిన జగన్ ప్రచార పైత్యం! ప్రజలు కష్టపడి కట్టుకున్న ఇళ్లు.. అప్పుచేసి కొనుక్కున్న స్థలాలు.. వారసత్వంగా వచ్చిన పొలాలు.. ఇలా ఏదైనా ఆయనకు అనవసరం. వాటిపై తన ఫొటో, వైకాపా రంగుపడిందా? లేదా? అన్నదే ప్రధానం. ఉప్పు, పప్పు, నీరు, బియ్యం రాళ్లూరప్పలు, ఓపీ స్లిప్పులు.. బడిలోని నోటుబుక్కులు, విద్యార్థుల బెల్టులు శ్మశానాలు, భూహక్కులు, మరణ ధ్రువీకరణ పత్రాలపై తన బొమ్మ, పార్టీ రంగులు వేయించుకున్నారు.. రూ. కోట్ల నిధులను గంగలో కలిపారు జగన్!
‘‘ప్రజలకు ఏం చేశాం అన్నది ప్రధానం కాదు.. ప్రచారం ఎంత చేశాం అనేది ముఖ్యం..’’
ఇదీ.. జగన్ తన ఐదేళ్ల పాలనలో అనుసరించిన విధానం. పథకం ఏదైనా, కార్యక్రమం ఎలాంటిదైనా జగన్ బొమ్మ పడాల్సిందే. ఆస్పత్రా.. నీటి ట్యాంకా.. ప్రభుత్వ కార్యాలయమా.. అన్నది అనవసరం. వాటిపై వైకాపా రంగు పడాల్సిందే. ప్రజలను ఆకట్టుకోవడం కోసం ప్రచార యావతో.. ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేశారు. మరణ ధ్రువీకరణ పత్రాలపై, తాతముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన భూముల పట్టాదారు పాసుపుస్తకాలపై ఫొటోలను ముద్రించుకోవడానికీ వెనకాడలేదంటే జగన్ ప్రచార పిచ్చి అర్థం చేసుకోవచ్చు. ‘నా భూమిపై నీ పేరేంటి? నీ పెత్తనమెందుకు?’ అని అన్నదాతలు నిలదీసినా సమాధానాలు చెప్పలేదు జగన్. పొలాలు, ఇళ్లు, శ్మశానాల్లోని హద్దురాళ్లకూ ‘జగనన్న’ పేరు పెట్టేసి వికృతానందం పొందారు. అన్నింటికి తన బొమ్మ, పేరు ఉంటే ‘దిష్టి’ తగులుతుందనుకున్నారో ఏమో.. కొన్ని పథకాలకు ‘వై.ఎస్.ఆర్’ పేరు పెట్టారు. ఇలా మొత్తం.. 120కి పైగా ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై జగన్ బొమ్మలూ, ముద్రలే కనిపిస్తున్నాయి. అందుకు అయిన ప్రచార ఖర్చు.. రూ.5 వేల కోట్లు. ఇదంతా జనం సొమ్మే..
ప్రజల ప్రశ్నలకు బదులేదీ?
ప్రైవేటు వ్యక్తుల ఆస్తిపత్రాలపై జగన్ తన బొమ్మ ఎలా వేసుకుంటారని మేధావులు, సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ ప్రజలు ఎండగడుతున్నారు. ‘భూమి నాది.. పుస్తకం నాది.. మధ్యలో ఈ జగన్ పైత్యం ఏంటీ..?’ అని కొందరంటున్నారు.
రంగుల ఖర్చు రూ.2,300 కోట్లు..
వైకాపా అధికారంలోకి రాగానే తొలుత టిడ్కో ఇళ్ల రంగులు మార్చింది. తర్వాత అన్న క్యాంటీన్లు, నీటి ట్యాంకులు, ఆస్పత్రులు, రైతు భరోసా కేంద్రాలు.. ఇలా ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ రంగులు అద్దేసి రాక్షసానందం పొందింది. కొత్తగా నిర్మించే సచివాలయాలకు మూడు రంగులు వేయాలని 2019లో అధికారులు ఆదేశించారు. ఈ నిర్ణయం ఫలితంగా ఖజానాపై పడిన భారం రూ.1,300 కోట్ల పైమాటే. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు న్యాయస్థానాలను ఆశ్రయించాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ రంగులు వేసే ప్రక్రియకు స్వస్తి చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో మళ్లీ రూ.1,000 కోట్లకుపైగా ఖర్చు చేసి రంగులు వేశారు. ఇలా వైకాపా ప్రభుత్వం రంగులకే రూ.2,300 కోట్లకు పైగా ప్రజాధనాన్ని వృథా చేసింది.
జేబుల్లోంచి డబ్బు ఇచ్చారా?
వ్యవసాయ, దాని అనుబంధ శాఖల పరిధిలో అమలవుతున్న 15కు పైగా కార్యక్రమాలకు ప్రభుత్వం ‘వై.ఎస్.ఆర్’, ‘జగన్’ పేర్లు పెట్టేసింది. ఆ శాఖకు సంబంధించిన యాప్లనూ వారిద్దరి పేర్లు వచ్చేలా రూపొందించారు. అందుకు రూ.కోట్లు ఖర్చుచేసినా ఆ యాప్లు ఉన్న విషయమే రైతులకు తెలియదు. ఏ పథకం అయినా సరే ముందు ‘జగనన్న’ పేరు తగిలించి తన జేబుల్లోంచి డబ్బు ఇచ్చినట్లుగా గొప్పలు చెప్పుకొన్నారు. ఈ వైకాపా ప్రచారపిచ్చిలో కొందరు అధికారులూ భాగస్వాములయ్యారు. నవరత్నాల లోగో పేరుతో ఒక్కో సచివాలయానికి రూ.5 వేలు వెచ్చించారు. రేషన్ వాహనాలపైన కూడా జగన్ బొమ్మలు, మూడు రంగులు వేసి ప్రచారం చేసుకున్నారు. వీటికి రూ.వందల కోట్ల ప్రజాధనాన్ని వ్యయం చేశారు.
శాశ్వత పత్రాలన్న స్పృహే లేదు..
ప్రజలకు దశాబ్దాలుగా పట్టాదారు పాసుపుస్తకాలు, ఆదాయ, కుల తదితర ధ్రువీకరణ పత్రాలు జారీ అవుతున్నాయి. వాటిపై ముఖ్యమంత్రుల పేర్లు, ఫొటోలు ముద్రించిన దాఖలాలు లేవు. జగన్ పాలనలోనే అది సాధ్యమైంది!. సాధారణంగా ఏ పథకాలకు నేతల పేర్లు పెడితే అవి ఐదేళ్లకే పరిమితమవుతాయి. కానీ ధ్రువీకరణ పత్రాలు శాశ్వతంగా ఉంటాయి. ఆ స్పృహనే వైకాపా సర్కారుకు కరవైంది. ఫ్యామిలీ మెంబర్, 1బీ, అడంగల్, భూయాజమాన్య హక్కు పత్రం, శాశ్వత కులధ్రువీకరణ పత్రాలు పలు ధ్రువీకరణ పత్రాలన్నింటినీ జగన్ బొమ్మలతోనే ముద్రించారు.
కోడిగుడ్లపైనా.. సిగ్గు సిగ్గు
అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇచ్చే కోడిగుడ్లపై కూడా జేజీఎం (జగనన్న గోరుముద్ద) అంటూ ముద్రలు వేశారు. పిల్లలు తినే చిక్కీలూ, బడిగోడల నుంచి విద్యార్థులకు ఇచ్చే బెల్టులు, బ్యాగులు, పాలప్యాకెట్లు, బియ్యం సంచులు.. ఇలా ప్రతిదానిపైనా జగన్ పేరు, బొమ్మలే.
బాధ్యులపై చర్యలు ఉండవా?
వాస్తవానికి ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, భవనాలకు ఏ పేరు పెట్టాలన్నా, రంగులు వేయాలన్నా ఎవరో ఒకరు ప్రతిపాదించాలి. అయితే వీటిని ప్రతిపాదించిన అధికారులు ఎవరు? వారిపై చర్యలు ఏంటీ? అన్నది ప్రశ్నార్థకమే. గ్రామ/వార్డు, మీసేవా కేంద్రాల ద్వారా ఇచ్చే ధ్రువీకరణ పత్రాలపైనా జగన్ ముద్రలేశారు. వీటికి ఒక్కో దానికి రూ.50 వరకు ఖర్చు పెట్టారు. తీరా ఎన్నికల సంఘం నిలిపేయమని ఆదేశించడంతో పక్కన పెట్టారు. దీనికి రూ.కోట్లలో నిధులు దుర్వినియోగం అయ్యాయి. వాటిని కొనుగోలు చేసి నష్టపోయామని మీసేవా కేంద్రాల నిర్వాహకులు వాపోతున్నారు.
ఈనాడు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
కొత్త విద్యాసంవత్సరం(2024-25)లో రాష్ట్రంలో ఇంజినీరింగ్ తదితర వివిధ ఉన్నత విద్య కోర్సుల్లో గతంలో మాదిరిగానే ప్రవేశాలు నిర్వహించనున్నారు. -
భయపెడుతున్న ఏపీ రెవెన్యూ, ద్రవ్యలోటు
రెవెన్యూ ఖర్చుల నియంత్రణ, అప్పుల నియంత్రణపైనే రాష్ట్ర ఆర్థిక నిర్వహణ ఆధారపడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికప్పుడు రెవెన్యూ లోటు పెరిగిపోతూ ఉంది. ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం రెవెన్యూ లోటు లేకుండా చూడాలి. -
రూ.లక్షల్లో జీతాలు.. ఫలితాలు అంతంతమాత్రమా?
‘రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు.. ఫలితాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి.. ఇలాగైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉద్యోగాలు ఎలా వస్తాయి..’ అని ఉపాధ్యాయులు, విద్యా శాఖ అధికారులను పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ ప్రశ్నించారు. -
చాట్ జీపీటీ కంటే మెరుగైన తెలుగు సాఫ్ట్వేర్ తీసుకొస్తాం
చాట్ జీపీటీ కంటే మెరుగ్గా తెలుగులో సరికొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నట్లు స్వేచ్ఛ సంస్థ వ్యవస్థాపకులు వై.కిరణ్చంద్ర తెలిపారు. -
ఏం చెప్పినా.. తందానతాన!
కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర కీలక స్థానాల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారిని ఏరికోరి నియమించిందీ ఆయనే..! కొన్ని జిల్లాల్లో వివాదాస్పద అధికారులున్నారని, వారు ఎన్నికల వేళ అధికార పార్టీతో అంటకాగుతున్నారన్న విపక్షాల ఫిర్యాదుల్ని పట్టించుకోకుండా చోద్యం చూసిందీ ఆయనే..! తీరా ఎన్నికల సంఘం కన్నెర్ర చేస్తే.. -
పల్నాడు కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీ లఠ్కర్
రాష్ట్రంలోని మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను, ఒక జిల్లాకు కలెక్టర్ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. పల్నాడు జిల్లా కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీరావు లఠ్కర్, ఎస్పీగా మలికా గార్గ్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలి, తిరుపతి ఎస్పీగా వి.హర్షవర్ధన్ రాజును నియమించింది. -
ప్రవాస వైద్యుడిపై పోలీసుల దాష్టీకం
జగన్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నందుకు ఏపీ పోలీసులు కక్షగట్టి తనను కొట్టడంతోపాటు అమానుషంగా ప్రవర్తించారని అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. -
తెలంగాణ ఎప్సెట్లో ఏపీ విద్యార్థుల విజయదుందుభి
తెలంగాణ ఎప్సెట్-2024లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. ఎప్సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల ర్యాంకులను శనివారం ఆ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి తదితరులు విడుదల చేశారు. -
రాజేంద్రనాథరెడ్డి సిబ్బందే సిట్ సభ్యులు!
ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజున, ఆ తర్వాత చెలరేగిన హింసాకాండకు పూర్వ డీజీపీ, ప్రస్తుత ఏసీబీ డీజీ కేవీ రాజేంద్రనాథరెడ్డి నియమించిన అధికారులే కారణమని ఓ వైపు విమర్శలు వ్యక్తమవుతుంటే.. మళ్లీ ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిబ్బందినే సిట్లో నియమించడమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. -
ఎప్సెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వారంలో..
తెలంగాణ ఎప్సెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ కాలపట్టికను వారం రోజుల్లో విడుదల చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
ఈఏపీసెట్ ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు ప్రారంభం
ఏపీఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉదయం సెషన్ ఒకటే నిర్వహించినట్లు సెట్ ఛైర్మన్, జేఎన్టీయూకే వీసీ జీవీఆర్ ప్రసాదరాజు, కన్వీనర్ కె.వెంకటరెడ్డి తెలిపారు. -
ఆరు వారాల్లో తేల్చండి.. ఏపీ చెస్ అసోసియేషన్కు గుర్తింపుపై హైకోర్టు ఆగ్రహం
ఏపీ చెస్ అసోసియేషన్కు అనుబంధ గుర్తింపు ఇచ్చే వ్యవహారంలో జాతీయ క్రీడల కోడ్ నిబంధనలకు లోబడి తగిన ఉత్తర్వులు జారీచేయాలని అఖిల భారత చదరంగ సమాఖ్య కార్యదర్శిని.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ఫొటోతో నకిలీ వాట్సప్ కాల్స్
ఆర్టీసీ ఎండీ సిహెచ్.ద్వారకా తిరుమలరావు ఫొటోను వాట్సప్ డీపీగా పెట్టి.. ఆయనే ఫోన్ చేస్తున్నట్లుగా 70334 00216 నంబరుతో పలువురికి వాట్సప్ కాల్స్ చేసి బురిడీ కొట్టించేందుకు సైబర్ నేరగాళ్లు యత్నించారు. -
‘ప్రమాదాలు ఆందోళనకరం..’ పట్టించుకోని అధికారగణం!
రాష్ట్రంలో వరస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వాహనాలు నడిపే వారి నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణలోపం ఫలితంగా వందల మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఐదు రోజుల కిందట చిలకలూరిపేట వద్ద ప్రైవేటు బస్సు లారీని ఢీకొట్టడంతో మంటలు ఎగిసి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. -
స్ట్రాంగ్రూమ్ కారిడార్లోకి వర్షపు నీరు
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి నిమ్రా కళాశాలలో ఏర్పాటుచేసిన ఈవీఎంల స్ట్రాంగ్రూమ్ కారిడార్లోకి వర్షపు నీరు చేరుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. -
స్ట్రాంగ్రూమ్ల వద్ద పకడ్బందీ భద్రత ఉండాలి
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్ల వద్ద అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా ఆదేశించారు. -
24లోగా రబీ పంట నష్టాన్ని లెక్కించండి
రబీ కరవు ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెల 24 లోగా పంటనష్టం గణన పూర్తి చేయాలని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ ఆదేశించారు. రాజకీయ లబ్ధికి తావులేకుండా నష్టాన్ని లెక్కించాలని ఎన్నికల సంఘం ఆదేశించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారులకు సూచించారు. -
ఏబీ వెంకటేశ్వరరావుకు మద్దతుగా సంతకాల సేకరణ
జగన్ ప్రభుత్వ కక్షపూరిత చర్యలకు బలైపోయిన డీజీ ర్యాంకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు పౌర సమాజం నుంచి విశేష మద్దతు లభిస్తోంది. ఆయనకు న్యాయం చేయాలంటూ రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తూ ‘ఛేంజ్.ఓఆర్జీ’లో వేల మంది సంతకాలు చేస్తున్నారు. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి క్యూలైన్లో వచ్చిన భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం టైమ్స్లాట్ టోకెన్లు లేని భక్తులు శనివారం వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి ఔటర్రింగ్ రోడ్డు, శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. -
ఉన్నత విద్యామండలి ఛైర్మన్పై గవర్నర్కు ఫిర్యాదు
ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డిపై గవర్నర్కు ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా ఫిర్యాదు చేయగా.. చర్యల కోసం వాటిని ఉన్నత విద్యాశాఖకు పంపించారు. -
కోడ్ ఉల్లంఘన ఆరోపణలతో ఏయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ సస్పెన్షన్
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆంధ్ర విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.జి.లావణ్య దేవిని సస్పెండ్ చేస్తూ రిజిస్ట్రార్ ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
-
ట్రంప్నకు జాతీయ రైఫిల్ అసోసియేషన్ మద్దతు..!
-
బుక్ చేస్తే 24 గంటల్లో నీటి ట్యాంకర్
-
ఇంటి దొంగల గుండెల్లో రైళ్లు.. పల్నాట రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం
-
గతేడాది ‘ఫైనల్’ ఓవర్ పునరావృతం అవుతుందనుకున్నా: రుతురాజ్ గైక్వాడ్
-
భయపెడుతున్న ఏపీ రెవెన్యూ, ద్రవ్యలోటు