Stock Market: నష్టాల్లోనే స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @ 22,271

Stock Market Opening bell: ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్‌ 145 పాయింట్ల నష్టంతో 73,321 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 31 పాయింట్లు కుంగి 22,271 దగ్గర కొనసాగుతోంది.

Published : 09 May 2024 09:39 IST

Stock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు మన సూచీలను ప్రభావితం చేస్తున్నాయి. ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్‌ 145 పాయింట్ల నష్టంతో 73,321 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 31 పాయింట్లు కుంగి 22,271 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.47 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 సూచీలో ఎం అండ్‌ ఎం, మారుతీ, టాటా మోటార్స్‌, ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్ టెక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఇండస్ఇండ్ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎల్‌ అండ్‌ టీ, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, ఎన్‌టీపీసీ, ఐటీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, సన్‌ఫార్మా, నెస్లే ఇండియా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు (Stock Market) బుధవారం మిశ్రమంగా ముగిశాయి. ఆసియా ప్రధాన సూచీలు నేడు అదే బాటలో పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 83.94 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs)’ బుధవారం నికరంగా రూ.6,669.10 కోట్ల విలువ చేసే వాటాలను విక్రయించారు. ‘దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs)’ రూ.5,928.81 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని