లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్లోకి 30 మంది భారాస ఎమ్మెల్యేలు: మంత్రి కోమటిరెడ్డి
యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్కేంద్రాల్లో అక్రమాలతో పాటు ఛత్తీస్గఢ్లో కరెంటు కొనుగోళ్లలో అవినీతి బయటపడుతుందన్న అక్కసుతోనే తనపై మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు.
ఈనాడు, నల్గొండ: యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్కేంద్రాల్లో అక్రమాలతో పాటు ఛత్తీస్గఢ్లో కరెంటు కొనుగోళ్లలో అవినీతి బయటపడుతుందన్న అక్కసుతోనే తనపై మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. విద్యుత్కేంద్రాల్లో అవకతవకలపై విజిలెన్స్, సిటింగ్ జడ్జి విచారణ అనంతరం కేసీఆర్ కుటుంబం తర్వాత జైలుకు వెళ్లేది ఆయనేనని చెప్పారు. తమ ప్రభుత్వం పడిపోదని.. పూర్తికాలం అధికారంలో ఉంటుందని స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత భారాసలో 10 మంది ఎమ్మెల్యేలు కూడా మిగలరని.. కాంగ్రెస్లోకి 30 మంది వస్తారని పేర్కొన్నారు.
నల్గొండ కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమంతో పాటు తిప్పర్తి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలిపెట్టిన తన గురించి జగదీశ్రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఆయనకు రూ.వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో ప్రజలకు చెప్పాలన్నారు. వంద రోజుల్లోపు గ్యారంటీలను అమలు చేస్తామని.. కరెంటు బిల్లులు కట్టొద్దని అనడం మానుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ను ఉద్దేశించి వెంకట్రెడ్డి అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా.. 30 వేల నియామకాలు ఎలా చేపట్టారు?
అభయహస్తం అంటూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలపై భస్మాసుర హస్తం మోపుతోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ గెలుపొందాక ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా 30 వేల నియామకాలు ఎలా చేపట్టిందో చెప్పాలని ప్రశ్నించారు. -
నాయకులను కొనుగోలు చేస్తున్న సీఎం
రాష్ట్రంలో ప్రజల సమస్యలు పట్టించుకోకుండా సీఎం రేవంత్రెడ్డి ఓట్లు, నాయకులను కొనుగోలు చేస్తున్నారని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ ఆరోపించారు. ఆరు గ్యారంటీల అమలు అంశానికి అతీగతీ లేదని విమర్శించారు. -
ఏపీ ఎన్నికల్లో తెదేపాకే మొగ్గు
ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో తెదేపా, వైకాపాల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్లు సాగినప్పటికీ మొగ్గు తెదేపావైపే కనిపిస్తోందని దిల్లీలోని ప్రముఖ పరిశోధన సంస్థ సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్డీఎస్)కు చెందిన సీనియర్ సెఫాలజిస్ట్ ప్రొఫెసర్ సంజయ్కుమార్ తెలిపారు. -
రాళ్లదాడి ఘటనలో 47 మందిపై కేసు
వైఎస్సార్ జిల్లా కడప రెండో పట్టణ పోలీసుస్టేషన్ పరిధి గౌస్నగర్లో ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 13న రాత్రి వైకాపా, తెదేపా నేతలు, కార్యకర్తల మధ్య జరిగిన రాళ్లదాడి ఘటనకు సంబంధించి పోలీసులు ఎట్టకేలకు సోమవారం కేసులు నమోదు చేశారు. -
తెదేపా ముసుగులో విద్వేష ప్రసంగాలు చేస్తున్న కృష్ణారెడ్డిని అరెస్టు చేయాలి
సామాజిక మాధ్యమాల్లో తెదేపా కండువా ధరించి కులాల మధ్య వైషమ్యాలు సృష్టించేలా వీడియోలు చేస్తున్న వైకాపా నాయకుడు మన్విత్ కృష్ణారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఐడీ అధికారులకు తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. -
బాధితులకు అండగా నిలిచిన మీడియాపై కేసులా?
వైకాపాకు ఓట్లేయలేదన్న కక్షతో విశాఖ కంచరపాలెంలోని ఓ కుటుంబంపై ఆ పార్టీ నేతలు చేసిన దాడి ఘటనను తప్పుదోవ పట్టించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఎన్డీయే నేతలు మండిపడ్డారు. -
ఎవరొస్తారో రండ్రా.. అంటూ బోరుగడ్డ అనిల్ వీరంగం!
వైకాపా నాయకుడిగా చలామణి అవుతున్న బోరుగడ్డ అనిల్, తన అనుయాయులతో కలిసి కర్రలు పట్టుకుని సోమవారం రాత్రి గుంటూరు వేళాంగిణినగర్లో హల్చల్ చేశారు. -
సిట్ సభ్యులు మాచర్ల ఎందుకు వెళ్లలేదు?
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు, ఆ మర్నాడు పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణకు నియమించిన సిట్.. అసలు మాచర్ల పట్టణానికి వెళ్లలేదని తెలుస్తోంది. -
హింసాత్మక ఘటనలకు సీఎస్ జవహర్రెడ్డే బాధ్యుడు
రాష్ట్రంలో ఎన్నికల అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలకు సీఎస్ జవహర్రెడ్డే బాధ్యుడని తెదేపా సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. -
వైకాపాకు ఓటేయకపోతే దాడులే
ఎన్నికల్లో తమ పార్టీకి ఓట్లు వేయలేదని కక్షగట్టి సామాన్యులపై దాడులకు దిగడం వంటి ఘటనల్ని ఇది వరకు ఫ్యాక్షన్ ప్రభావితమైన కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చూసేవాళ్లం.
తాజా వార్తలు (Latest News)
-
రేవ్ పార్టీ హైదరాబాద్లో వద్దనుకొని.. బెంగళూరును ఎంచుకుని..
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్