Balineni: ఎవరికీ పట్టనప్పుడు నాకెందుకు: బాలినేని వ్యాఖ్య

ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులురెడ్డి అయితే జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకూ లాభమనే ఉద్దేశంతోనే తాను పట్టుబట్టానని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు.

Updated : 01 Feb 2024 08:16 IST

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులురెడ్డి అయితే జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకూ లాభమనే ఉద్దేశంతోనే తాను పట్టుబట్టానని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని తన నివాసంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు మాగుంట విషయంలో పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుంటే, తాను మాత్రమే అధిష్ఠానంతో ఎందుకు ఘర్షణ పడాలని వ్యాఖ్యానించారు. ఎంపీగా ఒక స్థాయి ఉన్న అభ్యర్థి అయితే మంచిదనేది తన భావనని తెలిపారు. ఎంపీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా తనకు అభ్యంతరం లేదన్నారు. ఒంగోలులో పాతిక వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పిన హామీని నిలబెట్టుకునే పని మీదే దృష్టి కేంద్రీకరించినట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని