ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నాపై వైకాపా దుష్ప్రచారం
వీడియోల్లో తాను మాట్లాడని అంశాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎడిటింగ్ ద్వారా మార్పులు చేసి వైకాపా దుష్ప్రచారానికి దిగిందని.. ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి జగన్ కుల, మత రాజకీయాలు చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.
ఓటమి భయంతోనే జగన్ కుల, మత రాజకీయాలు చేస్తున్నారు
ముస్లింల ప్రయోజనాల విషయంలో రాజీపడం
త్వరలో వారి అభివృద్ధికి ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటిస్తాం
ముస్లిం సంఘాల భేటీలో చంద్రబాబు
ఈనాడు - అమరావతి
వీడియోల్లో తాను మాట్లాడని అంశాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎడిటింగ్ ద్వారా మార్పులు చేసి వైకాపా దుష్ప్రచారానికి దిగిందని.. ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి జగన్ కుల, మత రాజకీయాలు చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. త్వరలో రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల అభివృద్ధికి త్వరలో ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటిస్తామని, వారికి పూర్తిగా అండగా నిలుస్తామని ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యానే భాజపాతో కలిశామని, ముస్లింలు దూరదృష్టితో ఆలోచించి బాసటగా నిలవాలని కోరారు. గతంలో భాజపాతో తెదేపా కలిసిన సందర్భంలోనూ ముస్లింల ఆర్థిక, సామాజిక, విద్య, రాజకీయ అంశాల్లో పూర్తిగా వెన్నుదన్నుగా నిలిచామని గుర్తుచేశారు. మతపరమైన అంశాల్లోనూ ఎక్కడా జోక్యం చేసుకోలేదని.. ఇప్పుడు కూడా ఎలాంటి రాజీ ఉండబోదని స్పష్టం చేశారు. ఉండవల్లిలోని నివాసంలో ఆయన మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఫరూక్ షిబ్లీ, ఇతర ముస్లిం సంఘాల నేతలతో సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల వేదికగా తెదేపాపై వైకాపా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు.
కోడికత్తి డ్రామా నుంచి బాబాయ్ హత్య వరకూ అన్ని అస్త్రాలూ ఉపయోగించిన జగన్ ఇప్పుడు కులాలు, మతాలపై పడ్డారని చంద్రబాబు మండిపడ్డారు. ‘జనసేనతో తెదేపా పొత్తు కుదుర్చుకున్న సమయంలో జగన్ కుల రాజకీయం చేసి బోల్తాపడ్డారు. భాజపాతో మేం పొత్తు ప్రకటించగానే మతపరమైన రాజకీయానికి తెరతీశారు. దీన్ని ముస్లిం సంఘాల నేతలు ఎండగట్టాలి. ముస్లింలపై జగన్కు ఉన్నది కపట ప్రేమే’ అని ధ్వజమెత్తారు. ‘జగన్కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రంజాన్ తోఫాను ఎందుకు ఆపేశారు? దుల్హన్, దుకాణ్-మకాన్ సహా పది సంక్షేమ పథకాలు ఎందుకు రద్దు చేశారు? కడపలో తెదేపా హయాంలో 90 శాతం కట్టిన హజ్హౌస్ను ఎందుకు పూర్తి చేయలేదు’ అని నిలదీశారు. జగన్కు అసలు ముస్లింల గురించి మాట్లాడే అర్హతే లేదని చంద్రబాబు ధ్వజమెత్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. -
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
-
భారీ ధరకు ‘తండేల్’ ఓటీటీ రైట్స్.. చైతూ కెరీర్లో బిగ్ డీల్
-
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
-
కెనడా ప్రధాని ట్రూడో సమక్షంలో.. ‘ఖలిస్థానీ’ నినాదాలు
-
బాలీవుడ్ స్టార్స్తో ఎన్టీఆర్.. వీడియో వైరల్