ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవికి సవాంగ్ రాజీనామా చేయాలి
గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనం మూడుసార్లు చేస్తే ఒక్కసారే జరిగిందంటూ ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్సవాంగ్ బుకాయించడం సిగ్గుచేటని, ఆయనకు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని.. తక్షణం రాజీనామా చేయాలని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ డిమాండ్ చేశారు.
మూడుసార్లు మూల్యాంకనం చేయించి ఒక్కసారేనని బుకాయింపు సిగ్గుచేటు
తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్
ఈనాడు, అమరావతి: గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనం మూడుసార్లు చేస్తే ఒక్కసారే జరిగిందంటూ ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్సవాంగ్ బుకాయించడం సిగ్గుచేటని, ఆయనకు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని.. తక్షణం రాజీనామా చేయాలని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ డిమాండ్ చేశారు. డీజీపీగా బాధ్యతాయుతమైన పదవిలో పనిచేసిన ఆయన నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. గ్రూప్-1 ఉద్యోగాల్లో రూ.150-200 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఆయన సోమవారం మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘తొలుత డిజిటల్ మూల్యాంకనం జరిగాక కార్యదర్శిగా ఉన్న పి.సీతారామాంజనేయులు మళ్లీ మాన్యువల్గా మూల్యాంకనం చేయించారు. ఇందుకు కంట్రోల్ బిండిల్ స్లిప్స్ సరఫరా చేయాలని డేటాటెక్ మెథడెక్స్కు లేఖ రాయడం వాస్తవం కాదా? జవాబు పత్రాలు స్ట్రాంగ్రూమ్కు తరలించేందుకు భద్రత కావాలని గుంటూరు ఎస్పీకి లేఖ రాయడం నిజం కాదా? తర్వాత స్ట్రాంగ్రూమ్ వద్ద కర్నూలునుంచి వచ్చిన 32 మంది కానిస్టేబుళ్లకు విధులు ఎందుకు కేటాయించారు? మాన్యువల్ విధానంలో మూల్యాంకనం జరగకపోతే సీతారామాంజనేయులు ఈ లేఖలు ఎందుకు రాశారు? హాయ్ల్యాండ్లో మూల్యాంకనానికి వచ్చిన అధికారులకు గదులు, భోజనాలకు రూ.20 లక్షలు చెల్లించడం వాస్తవం కాదా? వాటిని బయటపెడతారా? మూల్యాంకనం పూర్తి చేశామని, పోస్టు మూల్యాంకనం కోసం రావాలంటూ డేటాటెక్ మెథడాలజీకి రామాంజనేయులు మరో లేఖ ఎందుకు రాశారు? ఇవన్నీ నిజం కాదని చెప్పే ధైర్యం సవాంగ్కు ఉందా?’ అని పట్టాభిరామ్ నిలదీశారు.
గవర్నర్ ఆశ్చర్యపోయారు
‘ఈ స్కామ్పై మా వద్ద ఉన్న ఆధారాలు చూపిస్తే గవర్నర్ ఆశ్చర్యపోయారు. నా వద్ద ఉన్న ఆధారాలతో మీడియా సమక్షంలో చర్చకు వస్తా. సవాంగ్ ఈ చర్చకు సిద్ధమా? కోర్టు తీర్పు వెలువడగానే నైతిక బాధ్యత వహించి సవాంగ్ రాజీనామా చేయాల్సింది. గవర్నర్ తొలగించేలోపు రాజీనామా చేస్తే గౌరవప్రదంగా ఉంటుంది. ఇలాంటి ఛైర్మన్తో ప్రస్తుతం ఏపీపీఎస్సీ పరీక్షలు పారదర్శకంగా నిర్వహిస్తారని ఎలా నమ్మాలి? వీటి మూల్యాంకనంలోనూ అవకతవకలు జరగబోవని గ్యారెంటీ ఏమిటి? తెదేపా అధికారంలోకి రాగానే ఈ స్కామ్పై సీబీఐతో విచారణ చేయిస్తాం. ఎవరిని వదిలిపెట్టబోం’ అని పట్టాభిరామ్ హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. -
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు -
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్