ప్రధాని సభలో ఇంత భద్రతా వైఫల్యమా?
‘ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పాల్గొన్న ప్రజాగళం బహిరంగ సభలో అడుగడుగునా పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. సభలో ఎక్కడా ప్రజలను నియంత్రించే ప్రయత్నం చేయలేదు.
పేర్లు లేని పాస్లపై అధికారులు సంతకాలు చేసి ఇస్తారా?
తక్షణమే విచారణ జరపాలి
జనసేన నేత నాదెండ్ల మనోహర్
మంగళగిరి, న్యూస్టుడే: ‘ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పాల్గొన్న ప్రజాగళం బహిరంగ సభలో అడుగడుగునా పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. సభలో ఎక్కడా ప్రజలను నియంత్రించే ప్రయత్నం చేయలేదు. సభ జరుగుతున్న సమయంలోనే అనేక భద్రతా వైఫల్యాలు కనిపించాయి. పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై సమగ్ర విచారణ జరపాలి’ అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. ఈ మొత్తం వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ప్రధాని సభ కోసం జారీ చేసిన కీలక పాస్లు ఎవరి పేరుతో జారీ చేశారన్న వివరాలు కూడా లేవు. ప్రధాని సభలో ఏ పేరు లేని పాస్లపై అధికారులు సంతకాలు చేసి ఇచ్చేశారంటే భద్రతా వ్యవహారాలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. పోలీసుశాఖ, కలెక్టర్ కార్యాలయ అధికార యంత్రాంగం తప్పిదం ఇందులో కనిపిస్తోంది’ అని విమర్శించారు.
2020లోనే పవన్ కూటమి యత్నాలు
‘అమరావతి రైతులు 2020 జనవరిలో పవన్కల్యాణ్ను కలిసి వైకాపా ప్రభుత్వ దాష్టీకాలు, వారి కష్టాలు తెలియజేశారు. వాటిపై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు దిల్లీ వెళ్లినప్పుడే.. విపక్షాల ఓటు చీలకూడదని కూటమి ఏర్పాటుపై కేంద్ర పెద్దలతో పవన్ మాట్లాడారు. వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపగలమనే రాజకీయ వ్యూహంతోనే ఆయన ముందడుగు వేశారు. నాలుగేళ్ల పాటు ఆయన చేసిన కృషి వల్లే ఈ పొత్తు ఏర్పడింది. ఈ కూటమి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించబోతోంది’ అని మనోహర్ పేర్కొన్నారు. ‘ప్రజాగళం సభలో ప్రధానమంత్రి చెప్పినట్లుగా కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడటం వల్లనే ఏపీలో ప్రగతి పరుగులు తీస్తుంది. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే ఏపీలో అభివృద్ధి సాధ్యం. రాష్ట్రంలో వైకాపాకు ఇంటికెళ్లే సమయం దగ్గరకు వచ్చింది’ అని అన్నారు. సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షుడు మహేంద్రరెడ్డి, పీఏసీ సభ్యుడు పంతం నానాజీ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. -
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు -
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్