జన సమీకరణకు వైకాపా వల
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మంగళవారం సీఎం పర్యటన నేపథ్యంలో మద్యం పారించయినా, డబ్బులు వెదజల్లయినా జనాలను తరలించేందుకు వైకాపా విశ్వప్రయత్నాలు చేస్తోంది. రెండు లక్షల మందిని రప్పించి బలప్రదర్శన చేయాలని ప్రయత్నిస్తోంది.
రూ.500, మద్యం సీసా, బిర్యానీ ఇస్తామంటూ ప్రలోభాలు
ఈనాడు, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మంగళవారం సీఎం పర్యటన నేపథ్యంలో మద్యం పారించయినా, డబ్బులు వెదజల్లయినా జనాలను తరలించేందుకు వైకాపా విశ్వప్రయత్నాలు చేస్తోంది. రెండు లక్షల మందిని రప్పించి బలప్రదర్శన చేయాలని ప్రయత్నిస్తోంది. సమావేశానికి వచ్చేవారి పేర్లను సోమవారం ఉదయం నుంచి ఉమ్మడి జిల్లాలోని వైకాపా నాయకులు, గృహసారథులు, కన్వీనర్లు నమోదు చేసుకుంటున్నారు. బస్సెక్కగానే రూ.500, మద్యం సీసా ఇస్తామని, రెండు పూటలా బిర్యానీ పెడతామంటూ ప్రలోభాలకు గురి చేస్తున్నారు. రాజీనామా చేసిన వాలంటీర్లు జన సమీకరణ కోసం ఇంటింటికీ వెళ్లి ప్రజలను సభకు రావాలని పిలుస్తున్నారు.
నియమావళి ఉంటే మాకేంటి?: బస్సు యాత్ర సోమవారం రాత్రి ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం చేరుకోనుంది. జగన్ రాత్రికి అక్కడే బస చేయనున్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ఈ ప్రాంతానికి సమీపంలో ‘మేమంతా సిద్ధం’ పేరుతో భారీ ఫ్లెక్సీలను పెట్టారు. భీమవరం సభకు ఉమ్మడి పశ్చిమతోపాటు, కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాలనుంచి 1200 బస్సులు కేటాయించారు. ఆయా జిల్లాల్లో సామాన్య బస్సు ప్రయాణికులు ఇక్కట్లు తప్పేలా లేవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం
కడప జిల్లా వేంపల్లి మండలం కుమ్మరంపల్లిలో సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతికి చేదు అనుభవం ఎదురైంది. -
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. ప్రజల భూములు కొట్టేసే నల్ల చట్టమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. -
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. -
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం
-
సొంతగడ్డపై చెలరేగిన కోల్కతా.. దిల్లీపై ఘన విజయం
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!