మా అభ్యర్థుల గెలుపును ఆపలేరు: సీఎం రేవంత్‌

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుపును ఎవరూ ఆపలేరని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

Published : 17 Apr 2024 04:13 IST

భారాస నుంచి హస్తం గూటికి చేరిన కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుపును ఎవరూ ఆపలేరని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పూర్వ ఆదిలాబాద్‌ జిల్లా వాసి, భారాసకు చెందిన కేంద్ర మాజీ మంత్రి ఎస్‌.వేణుగోపాలాచారి, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా వాసి, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు మంగళవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వచ్చి రేవంత్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఆయన.. వారి మెడలో పార్టీ కండువా వేసి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. పార్టీ నిజామాబాద్‌ లోక్‌సభ అభ్యర్థి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ కారణంగానే ఇతర పార్టీల నేతలు వచ్చి చేరుతున్నారని సీఎం అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని