Harish Rao: ఎన్నికల కోడ్ను సాకుగా చూపించి తప్పించుకోవద్దు: హరీశ్రావు
కాంగ్రెస్ నేతలు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్లు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీశ్రావు వ్యాఖ్యానించారు.
సిద్దిపేట: కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత సహా విభజన హామీలు, బీసీ జనగణన తదితర అంశాలపై ఎంపీలు పార్లమెంట్లో గట్టిగా గళం వినిపించాలని భారాస పార్లమెంటరీ పార్టీ నిర్ణయించినట్లు మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. వివిధ అంశాలపై ఆయా శాఖల కేంద్ర మంత్రులను ఎంపీలు కలవాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రాజెక్టుల అప్పగింత విషయంలో కాంగ్రెస్, భాజపా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాయని, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో విఫలమయ్యాయన్నారు.
‘‘గత పదేళ్లుగా కృష్ణా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు ఇవ్వకుండా.. అనేక విషయాలపై స్పష్టత ఇవ్వాలని అడిగాం. స్పష్టత లేకుండా ప్రాజెక్టులు అప్పగించబోమని గతంలో తేల్చి చెప్పాం. కాంగ్రెస్ నేతలు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్లు మాట్లాడుతున్నారు. వారి అహంకారపూరిత వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు. హామీలు అమలు చేయాలని అడిగితే అసహనాన్ని వెళ్లగక్కుతున్నారు. భారాస హయాంలో విచారణలు చేసి ఉంటే ఎన్ని కేసులు పెట్టి ఉండేవాళ్లమో ఒకసారి పరిశీలించుకోవాలి. పాలనపై కాకుండా ప్రతిపక్షాలపైనే ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు. ఎన్నికల కోడ్ను సాకుగా చూపించి తప్పించుకోవద్దు’’ అని హరీశ్రావు అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షోభం వేళ చౌతాలాకు షాక్.. భాజపా గూటికి పార్టీ ఎమ్మెల్యేలు..!
Haryana Crisis: హరియాణాలో రాజకీయ సంక్షోభం వేళ జేజేపీ నాయకుడు దుశ్యంత్ చౌతాలాకు షాక్ తగిలింది. ఆయన పార్టీ ఎమ్మెల్యేలు భాజపా గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. దీంతో సైనీ ప్రభుత్వం మెజార్టీ సాధించే అవకాశాలు కన్పిస్తున్నాయి. -
హరియాణా సంక్షోభం.. ‘బలపరీక్ష’కు భాజపా మాజీ మిత్రుడి డిమాండ్
Haryana: హరియాణా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వానికి బలపరీక్ష నిర్వహించాలని ఆ రాష్ట్ర గవర్నర్కు జేజేపీ నాయకుడు దుశ్యంత్ చౌటాలా లేఖ రాశారు. -
శాంపిట్రోడా వ్యాఖ్యలను ఖండించిన చంద్రబాబు
దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారంటూ కాంగ్రెస్ నేత శాంపిట్రోడా చేసిన వ్యాఖ్యలను తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) ఖండించారు. -
తెదేపా, వైకాపా శ్రేణుల ఘర్షణ.. కుంకలగుంటలో పోలీసుల బందోబస్తు
జిల్లాలోని నకరికల్లు మండలం కుంకలగుంటలో తెదేపా, వైకాపా శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. -
సైనీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు మద్దతిస్తాం
హరియాణాలో ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు భూపీందర్సింగ్ హుడా చర్యలు చేపడితే తమ పార్టీ మద్దతిస్తుందని మాజీ ఉప ముఖ్యమంత్రి, జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) నాయకుడు దుశ్యంత్ చౌటాలా తెలిపారు. -
నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం గురువారంతో ముగియనుంది. -
భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రేమేందర్రెడ్డి
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు భాజపా అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్రెడ్డి బరిలో నిలవనున్నారు. -
కాంగ్రెస్లోకి పద్మశ్రీ గ్రహీత గజం గోవర్ధన్
పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం గోవర్ధన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు అఖిలభారత పద్మశాలి అన్నసత్రం భద్రాచలం అధ్యక్షుడు గోశిక యాదగిరి, తెలంగాణ పద్మశాలి సంఘం కార్యదర్శి నారా నరసింహా, ఆప్కో మాజీ డైరెక్టర్ గోశిక పాండులు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘పది’లో 625/625 మార్కులు.. అదరగొట్టావ్ అంకిత!
-
పూర్వ వైభవానికి బైజూస్ పాట్లు.. కోర్సు ఫీజు తగ్గింపు!
-
సంక్షోభం వేళ చౌతాలాకు షాక్.. భాజపా గూటికి పార్టీ ఎమ్మెల్యేలు..!
-
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు
-
ఆ విషయంలో మా నిబద్ధత మారదు: మాల్దీవుల మంత్రితో జైశంకర్
-
ప్రయాణికుల రద్దీ.. 22 రైళ్లకు అదనపు కోచ్లు