HD Kumaraswamy: ప్రజలు సమస్యల్లో ఉంటే కర్ణాటక నీరో క్రికెట్ మ్యాచ్ చూస్తూ కూర్చున్నారు: కుమారస్వామి
కర్ణాటకలోని (Karnataka) అధికార కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంపై జేడీఎస్ (Jds) నేత, మాజీ సీఎం కుమారస్వామి (kumaraswamy) విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కరెంటు కొరతను ప్రభుత్వమే సృష్టించిందని ఆరోపించారు.
బెంగళూరు: కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) పాలన కాకుండా ‘స్కాంగ్రెస్’ పాలన కొనసాగుతోందని జేడీఎస్ (Jds) నేత, మాజీ సీఎం కుమారస్వామి (kumaraswamy) ఘాటుగా విమర్శించారు. ఇటీవల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య క్రికెట్ మ్యాచ్ చూడటాన్ని తప్పుపట్టారు. ‘రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయిస్తూ కూర్చున్నాడు. ఇక్కడ ప్రజలు సమస్యల్లో ఉంటే కర్ణాటక నీరో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడని’ ట్విటర్లో పోస్టు పెట్టారు.
ఏడాది తర్వాత భాజపా కార్యాలయానికి ఎమ్మెల్యే రాజాసింగ్
కర్ణాటక రాష్ట్రం విద్యుత్ సమస్యను ఎదుర్కొంటుంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు క్రికెట్ చూడటంలో మునిగిపోయారని దుయ్యబట్టారు. కరెంటు కొరతను ప్రభుత్వమే సృష్టించిందని ఆరోపించారు. కమీషన్ల కోసమే బయటి నుంచి కరెంటును కొనుగోలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 32,912 మెగావాట్లను ఉత్పత్తి చేసే వ్యవస్థ ఉన్నప్పటికీ నిర్వహణ లోపం కారణంగా 12వేల మెగావాట్ల ఉత్పత్తి మాత్రమే జరుగుతోందన్నారు. విద్యుత్ లోటుపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే, మ్యాచ్ను వీక్షించడంపై వచ్చిన విమర్శలను ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఖండించారు. జీవితం అంటే రాజకీయాలు మాత్రమే కాదని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాయావతి కీలక ప్రకటన.. వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ తొలగింపు
Mayawati: డిసెంబర్లో తన రాజకీయ వారసుడిగా మాయావతి తన మేనల్లుడైన ఆకాశ్ ఆనంద్ను ప్రకటించారు. తాజాగా కీలక బాధ్యతల నుంచి ఆయన్ని తొలగిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టం.. రైతుల భూముల్ని కొల్లగొట్టేందుకే
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని దొడ్డిదారిన అమలు చేసేందుకు సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని ఎన్డీయే నేతలు విమర్శించారు. -
ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు?
ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్కుమార్కు చేదు అనుభవం ఎదురైంది. -
నూర్బాషాల సంక్షేమానికి కూటమి మ్యానిఫెస్టోలో రూ.100 కోట్లు కేటాయిస్తామనడం హర్షనీయం
నూర్బాషాల సంక్షేమానికి రూ.వంద కోట్లు కేటాయిస్తామని తెదేపా, జనసేన మ్యానిఫెస్టోలో చెప్పడం హర్షనీయమని తెదేపా నూర్ బాషా నాయకులు నాగుల్మీరా, పీర్ మహ్మద్బుజ్జి, షేక్ సుభాని, నాగుల్ అన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులకు ఉరితాడే
రాష్ట్రంలోని ఇసుక, గనులతో పాటు అన్ని సహజవనరులను దోచుకున్న సీఎం జగన్ ఇప్పుడు ప్రజల ఆస్తులపై కన్నేశారని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి ధ్వజమెత్తారు. -
హరియాణా రాజకీయాల్లో కలకలం
హరియాణాలో అధికార భాజపా ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని ప్రభుత్వానికి తాము మద్దతు ఉపసంహరిస్తున్నట్లు ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యులు మంగళవారం ప్రకటించారు. -
అయిదో రోజు మరో ఏడుగురు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వంలో ఐదో రోజు మంగళవారం మరో ఏడుగురు అభ్యర్థులు కొత్తగా నామినేషన్ వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. రిప్లై ఇచ్చిన ‘దేవర’ భామ
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఉద్యోగుల మూకుమ్మడి సెలవు.. 70కి పైగా విమానాలు రద్దు
-
క్యాచ్పై అంపైర్తో తీవ్ర వాగ్వాదం.. సంజూకు భారీ జరిమానా
-
వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ.. కోడె మొక్కులు చెల్లింపు
-
ఇజ్రాయెల్కు భారీ షాకిచ్చిన అమెరికా.. కీలక ఆయుధ సరఫరా నిలిపివేత
-
గిరాకీ తగ్గింది.. టీకాను మార్కెట్ నుంచి వెనక్కు తీసుకుంటున్నాం: ఆస్ట్రాజెనెకా