Rajasingh: ఏడాది తర్వాత భాజపా కార్యాలయానికి ఎమ్మెల్యే రాజాసింగ్‌

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ భాజపా కార్యాలయానికి వచ్చారు. దాదాపు ఏడాది తర్వాత ఆయన పార్టీ కార్యాలయంలో అడుగుపెట్టారు.

Published : 22 Oct 2023 16:47 IST

హైదరాబాద్‌: గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ భాజపా కార్యాలయానికి వచ్చారు. దాదాపు ఏడాది తర్వాత ఆయన పార్టీ కార్యాలయంలో అడుగుపెట్టారు. గతేడాది రాజాసింగ్‌ను భాజపా అధిష్ఠానం సస్పెండ్‌ చేసింది. అప్పటి నుంచి ఆయన పార్టీ కార్యాలయానికి దూరంగా ఉన్నారు. తాజాగా ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేయడంతో పాటు.. మళ్లీ గోషామహల్‌ నియోజకవర్గానికి పార్టీ అభ్యర్థిగా అధిష్ఠానం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆయన భారీ ర్యాలీగా ఆదివారం పార్టీ కార్యాలయానికి వచ్చి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలిశారు. రాముడికి 14 ఏళ్ల వనవాసం ఉంటే.. తనకు తనకు 14 నెలలు వనవాసం వేశారని ఈ సందర్భంగా రాజాసింగ్‌ నవ్వుతూ వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని