Punjab polls: ‘మా నాన్నని ఎవరూ ఆపలేరు’.. సిద్ధూ కుమార్తె ఆసక్తికర వ్యాఖ్యలు
సీఎం అభ్యర్థిగా సిద్ధూని ఎన్నుకోకపోవడంపై ఆయన కుమార్తె రబియా కౌర్ తాజాగా స్పందించారు. ఆయన్ను ఎక్కువకాలం ఎవరూ ఆపలేరని......
చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ.. చన్నీ వైపే అధిష్ఠానం మొగ్గుచూపిన విషయం తెలిసిందే. పోటీలో ఉన్న ఇద్దరిలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నవజ్యోత్సింగ్ సిద్ధూని పక్కనపెడుతూ.. ప్రస్తుత సీఎం చరణ్జీత్సింగ్ చన్నీనే అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది. అయితే అధిష్ఠానం నిర్ణయంపై సిద్ధూ సహా ఆయన కుటుంబసభ్యులు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం అభ్యర్థిగా సిద్ధూని ఎన్నుకోకపోవడంపై ఆయన కుమార్తె రబియా కౌర్ తాజాగా స్పందించారు. ఆయన్ను ఎక్కువకాలం ఎవరూ ఆపలేరని.. తన తండ్రిని ఓ అవినీతిపరుడితో పోల్చి చూడొద్దని వ్యాఖ్యానించారు.
జాతీయ మీడియాతో రబియా మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ హైకమాండ్ ఏ ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుందో నాకు తెలియదు. దాని గురించి మాట్లాడాలని అనుకోవడం లేదు. కానీ నిజాయతీ గల ఓ వ్యక్తిని ఎవరూ ఎక్కువకాలం ఆపలేరు’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చన్నీ పేరు ప్రస్తావించకుండా.. ఆయనో అవినీతిపరుడిని ఆరోపించారు. ఓ నిజాయతీ గల వ్యక్తితో పోల్చిచూడొద్దు అని అన్నారు. ‘సీఎం అభ్యర్థిగా ఆయన (సిద్ధూ) ఉన్నా, లేకపోయినా ఏం పర్వాలేదు. ఆయన ఇమెజ్పై ఎలాంటి మరకలు లేవు. రానున్న రోజుల్లో గర్వపడే పనులు చేస్తారు’ అని పేర్కొన్నారు. సీఎం అభ్యర్థిగా చన్నీ ఎంపిక.. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కమ్ములాటలకు దారితీశాయని వార్తలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఈ పరిణామాలు కాంగ్రెస్కు ఎలాంటి ఫలితాలనిస్తాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయం
వివేకాను జగన్మోహన్రెడ్డే హత్య చేయించారని, మాకంటే ముందు ఆయనే తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయమని ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి అభిప్రాయపడ్డారు. -
బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాంను ప్రజలు మరచిపోలేదు
మంత్రి బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మరచిపోలేదని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి బొత్స చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. -
తెలంగాణలో ధరణి.. ఏపీలో ల్యాండ్ చట్టం ఒక్కటే
తెలంగాణలో ధరణి చట్టం తీసుకొచ్చిన భారాస ఓడిపోయిందని, ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన జగన్కూ పరాభవం తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. -
పోలింగ్కు ముందు పథకాల సొమ్ము జమ చేయాలని కుట్రలు
ఎన్నికలకు ఒకటిరెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వ పథకాల సొమ్మును జమ చేయడం ద్వారా వారిని ప్రలోభపెట్టాలని వైకాపా ప్రభుత్వం కుట్రలు చూస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఎవరికివారు నష్టం చేకూర్చుకున్నట్టే
‘ప్రభుత్వాలు తీసుకొచ్చిన విధానాలు సరైనవి కాకపోతే.. అభివృద్ధి, సంక్షేమం, సాధికారికత ఇవేవీ సాధ్యం కావు. -
జేజేపీలో ముసలం!
హరియాణాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. భాజపా సర్కారును పడగొట్టాలని చూస్తున్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి సొంతపార్టీ ఎమ్మెల్యేల నుంచే ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు సమాచారం. -
ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఫ్రెండ్షిప్ మ్యారేజ్.. ఆ దేశంలో ఇదో కొత్త ట్రెండ్!
-
గూగుల్, యాపిల్కు పోటీగా మైక్రోసాఫ్ట్ గేమింగ్ స్టోర్
-
రోల్ మోడల్ లాంటి ఐపీఎల్లో... ఇదేం అంపైరింగ్!
-
ఖలిస్థానీ నేత అమృత్పాల్ సింగ్ నామినేషన్ దాఖలకు సహకరించాం: పంజాబ్ ప్రభుత్వం
-
వరుస నష్టాలకు బ్రేక్.. 260 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
గాయమా? వ్యూహమా? ధోనీ ‘9’లో రావడంపై ఫ్లెమింగ్ స్పందన ఇదీ!