CM Jagan: చింతపల్లిలో జగన్‌ పర్యటన.. సీపీఎం నేతల గృహనిర్బంధం

అల్లూరి జిల్లాలో గురువారం ముఖ్యమంత్రి జగన్‌ పర్యటించనున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలకు దిగారు.  

Published : 21 Dec 2023 09:59 IST

చింతపల్లి: అల్లూరి జిల్లాలో ముఖ్యమంత్రి జగన్‌ గురువారం పర్యటించనున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలకు దిగారు. చింతపల్లిలో సీపీఎం నాయకులను గృహనిర్బంధం చేశారు. ఆదివాసీలకు వందశాతం రిజర్వేషన్‌పై సీఎం ప్రకటన చేయాలని, జీవో నంబర్‌ 3 రిజర్వేషన్‌కు చట్టబద్ధత కల్పించాలని సీపీఎం నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఏజెన్సీ వ్యాప్తంగా బస్‌ సర్వీసులు నిలిపివేయడంతో ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారు. పర్యటనలో భాగంగా చింతపల్లిలో 8వ తరగతి విద్యార్థులకు సీఎం జగన్‌ ఉచితంగా ట్యాబ్‌లు పంపిణీ చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని