కేంద్ర మంత్రులకే రక్షణ కరవైతే ఎలా?
పశ్చిమ్బంగాల్లో కేంద్ర మంత్రి మురళీధరన్ కాన్వాయ్పై దాడిని భాజపా తీవ్రంగా తప్పుబట్టింది. కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికే రక్షణ కరవైతే రాష్ట్రంలోని సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలో హింసను ప్రేరేపిస్తున్నారని విమర్శించారు..
ప్రకాశ్ జావడేకర్
దిల్లీ: పశ్చిమ్బంగాల్లో కేంద్ర మంత్రి మురళీధరన్ కాన్వాయ్పై దాడిని భాజపా తీవ్రంగా తప్పుబట్టింది. కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికే రక్షణ కరవైతే రాష్ట్రంలోని సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలో హింసను ప్రేరేపిస్తున్నారని విమర్శించారు. ‘‘ కేంద్ర మంత్రిమంత్రి కాన్వాయ్పైనే దాడి జరిగిందంటే..బంగాల్లో ఇంకెవరు సురక్షితం. ఈ రాష్ట్రం హింసను ప్రేరేపిస్తోంది. ఈ చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. నిందితులను శిక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి’’ అని జావడేకర్ డిమాండ్ చేశారు.
పశ్చిమ్ మిడ్నాపూర్లో కేంద్ర మంత్రి మురళీధరన్ కాన్వాయ్పై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. తృణమూల్ కాంగ్రెస్కు చెందిన గూండాలే తనపై దాడికి దిగారని మంత్రి ఆరోపించారు. తన కారు అద్దాలు పగలగొట్టారని, తన వ్యక్తిగత సిబ్బందిపై భౌతిక దాడులకు దిగారని ఆయన అన్నారు. దాడికి సంబంధించిన వీడియోను ఆయన ట్విటర్లో పోస్టు చేయడంతో వైరల్గా మారింది. మరోవైపు ఓట్ల లెక్కింపు తర్వాత పశ్చిమ్బంగాల్లో హింసాత్మక ఘటనలు ఎక్కువవుతున్నాయని భాజపా ఆరోపిస్తోంది. తమ పార్టీ కార్యకర్తలే లక్ష్యంగా దాడులకు దిగుతున్నారని, ఇప్పటి వరకు 14 మంది కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. ఈ నేపథ్యంలో నిజనిర్ధారణ కోసం కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్