Jharkhand: ఎట్టకేలకు వీడిన అనిశ్చితి.. బలపరీక్షలో నెగ్గిన చంపయీ ప్రభుత్వం
ఝార్ఖండ్(Jharkhand)లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం తన బలాన్ని నిరూపించుకుంది.
రాంచీ: ఝార్ఖండ్(Jharkhand)లో చోటుచేసుకున్న రాజకీయ అనిశ్చితి ఎట్టకేలకు వీడింది. సోమవారం నిర్వహించిన బలపరీక్షలో ముఖ్యమంత్రి చంపయీ సోరెన్(Champai Soren) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం విజయం సాధించింది. మొత్తం 81 మంది ఎమ్మెల్యేలకు గానూ 47 మంది ఆయనకు మద్దతిచ్చారు. ఈ విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన అనంతరం సీఎం చంపయీ సోరెన్, మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భాజపాపై విమర్శలు గుప్పించారు.
‘ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు భాజపా యత్నించింది. హేమంత్ సోరెన్పై తప్పుడు కేసు పెట్టారు. కేంద్రం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోంది. నేను ఆయనకు పార్ట్-2’ అని చంపయీ(Champai Soren) వ్యాఖ్యానించారు.
అసెంబ్లీలో ప్రసంగించిన మాజీ సీఎం..
భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తమ కస్టడీలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్(Hemant Soren)ను ఈడీ అధికారులు అసెంబ్లీకి తీసుకువచ్చారు. బలపరీక్షలో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ సందర్భంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ‘జనవరి 31 రాత్రి.. దేశంలో మొదటిసారి ఒక ముఖ్యమంత్రి అరెస్టయ్యారు. దాని వెనక రాజ్భవన్ జోక్యం ఉందని నేను నమ్ముతున్నాను’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము ఓటమిని అంగీకరించడం లేదన్నారు. తనపై ఉన్న ఆరోపణలను ఈడీ నిరూపిస్తే.. తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానంటూ సవాలు విసిరారు. చంపయీ సోరెన్కు అధికార సంకీర్ణ ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉందని వెల్లడించారు. వాస్తవంగా రాజీనామా సమర్పించిన తర్వాతే హేమంత్ అరెస్టయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా, వైకాపా శ్రేణుల ఘర్షణ.. కుంకలగుంటలో పోలీసుల బందోబస్తు
జిల్లాలోని నకరికల్లు మండలం కుంకలగుంటలో తెదేపా, వైకాపా శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. -
సైనీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు మద్దతిస్తాం
హరియాణాలో ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు భూపీందర్సింగ్ హుడా చర్యలు చేపడితే తమ పార్టీ మద్దతిస్తుందని మాజీ ఉప ముఖ్యమంత్రి, జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) నాయకుడు దుశ్యంత్ చౌటాలా తెలిపారు. -
నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం గురువారంతో ముగియనుంది. -
భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రేమేందర్రెడ్డి
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు భాజపా అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్రెడ్డి బరిలో నిలవనున్నారు. -
కాంగ్రెస్లోకి పద్మశ్రీ గ్రహీత గజం గోవర్ధన్
పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం గోవర్ధన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు అఖిలభారత పద్మశాలి అన్నసత్రం భద్రాచలం అధ్యక్షుడు గోశిక యాదగిరి, తెలంగాణ పద్మశాలి సంఘం కార్యదర్శి నారా నరసింహా, ఆప్కో మాజీ డైరెక్టర్ గోశిక పాండులు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఉద్యోగులకు ఏఐఎక్స్ షాక్.. 25 మంది తొలగింపు.. మిలిగిన వారికి అల్టిమేటం
-
భారత క్రికెట్లో అభిషేక్ ఓ అద్భుతం.. సంచలనాలు సృష్టిస్తాడు: ట్రావిస్ హెడ్
-
షికాగోలో తెలంగాణ విద్యార్థి అదృశ్యం..
-
పన్నూ హత్యకు కుట్ర కేసు.. అమెరికా ఆరోపణల వేళ భారత్కు రష్యా మద్దతు
-
చిరు టు మహేశ్.. తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ రోజెంతో ప్రత్యేకం..!
-
నష్టాల్లోనే స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,271