Nellore: వైకాపాకు రాజీనామా చేసిన కావలి మాజీ ఎమ్మెల్యే

నెల్లూరు జిల్లాల్లో వైకాపాకు మరో ఎదురు దెబ్బ తగిలింది.

Published : 15 Mar 2024 16:44 IST

కావలి: నెల్లూరు జిల్లాల్లో వైకాపాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి.. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు శుక్రవారం మీడియా సమావేశంలో ప్రకటించారు. పదేళ్లుగా వైకాపాలో ఉంటే సరైన గుర్తింపు లేదని, హీనంగా చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కావలి, ఉదయగిరి అభ్యర్థుల విజయానికి పనిచేశానని గుర్తు చేశారు. ఆత్మాభిమానం చంపుకొని ఉండలేకే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అన్ని పార్టీల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయని, ఏ పార్టీలో చేరేది త్వరలోనే ప్రకటిస్తాన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని