Punjab Polls: పంజాబ్ సీఎం రెండు చోట్లా ఓడిపోతారు : కేజ్రీవాల్
పంజాబ్ సీఎం రెండు చోట్లా ఓడిపోతారని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ పేర్కొన్నారు.
ఇసుక మైనింగ్లో సీఎం ప్రమేయంపై మండిపడ్డ ఆప్ కన్వీనర్
అమృత్సర్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోన్న వేళ రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అక్కడి అధికార కాంగ్రెస్కు ప్రధాన పోటీగా తయారైన ఆమ్ఆద్మీ పార్టీ చన్నీ ప్రభుత్వానికి సవాల్ విసురుతోంది. ఈ నేపథ్యంలో పంజాబ్ సీఎం రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయడాన్ని ఆమ్ఆద్మీ పార్టీ ప్రచారాస్త్రంగా మలచుకుంటోంది. తాజాగా పంజాబ్ సీఎం రెండు చోట్లా ఓడిపోతారని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ పేర్కొన్నారు. తాము మూడోసారి నిర్వహించిన టెలిఫోనిక్ సర్వేలో ఇదే విషయం తేలిందని స్పష్టం చేశారు. ప్రచారంలో భాగంగా అమృత్సర్లో పర్యటించిన కేజ్రీవాల్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
‘ముఖ్యమంత్రి చన్నీ సాహెబ్ ఈసారి ఎన్నికల్లో చామ్కౌర్, భదౌర్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. మేం మూడుసార్లు జరిపిన సర్వేలో సీఎం చన్నీ రెండుచోట్లా ఓడిపోనున్నట్లు తేలింది. ఆయన ఎమ్మెల్యేగా గెలవకపోతే.. ఇక ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికవుతారు..?’ అని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇక సీఎం పోటీ చేస్తున్న చామ్కౌర్ నియోజకవర్గంలో ఆమ్ఆద్మీ పార్టీ 52శాతం ఓట్లు పొందనుందని.. భదౌర్లో తమ పార్టీకి 48శాతం ఓట్లు లభిస్తాయని భరోసా వ్యక్తం చేశారు.
ఇక పంజాబ్ సీఎం చన్నీపై వస్తోన్న ఇసుక మైనింగ్ ఆరోపణలపై కేజ్రీవాల్ మండిపడ్డారు. ఇప్పటికే చన్నీ బంధువు వద్ద దొరికిన డబ్బంతా సీఎందేనని నిందితుడు అంగీకరించినప్పటికీ ఈడీ ఆయనను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఇసుక అక్రమ మైనింగ్ విషయంలో పంజాబ్ సీఎంపై వస్తోన్న ఆరోపణలను ఆయన స్వయంగా దర్యాప్తు జరపలేరని.. ఆమ్ఆద్మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తాము నిష్పాక్షిక దర్యాప్తు చేస్తామని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. -
‘క్రిటికల్ రివర్’ కంపెనీ వెనుక ఐటీ సలహాదారు శేషిరెడ్డి
క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ వెనక వైకాపావారు, ఐటీ సలహాదారు పాటూరి శేషిరెడ్డి ఉన్నారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ఆరోపించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తొలుత రూపొందించింది జగన్ ప్రభుత్వమే
దేశంలో తొలిసారిగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రూపొందించిందే జగన్ ప్రభుత్వం అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన బిల్లును కేంద్రం తిప్పి పంపినా మూడు సార్లు ఆమోదం కోసం పంపారని గుర్తుచేశారు. -
సీఎస్ను వెంటనే బదిలీ చేయాలి: రఘురామ
రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగాలంటే సీఎస్నూ వెంటనే బదిలీ చేయాలని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు డిమాండు చేశారు. -
రాముడిని ఆరాధించానని దాడి చేశారు
కాంగ్రెస్ను వీడిన రాధికా ఖేడా ఆ పార్టీ ఛత్తీస్గఢ్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాముడి భక్తురాలిని అయినందుకే తనపై దాడి చేశారని సోమవారం ఆమె మీడియాకు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
రహదారిపై గుంతలు మాయం!.. వాటంతట అవే పూడుకునేలా ఎన్హెచ్ఏఐ కసరత్తు
-
ముఖ్యమంత్రి గారూ.. బటన్ నొక్కేస్తే నీళ్లిచ్చినట్లేనా..
-
ఒక క్లిక్తో.. పోలింగ్ కేంద్రం ప్రత్యక్షం
-
సీఎం కంచుకోటలో ఎందుకీ కలవరం?
-
ఆన్లైన్ జూదంలో అప్పులపాలు.. సాఫ్ట్వేర్ ఇంజినీరు ఆత్మహత్మ
-
ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ తప్పనిసరి