Kishan Reddy: ఎన్నికల కోసమే సీఎం కేసీఆర్ కొత్త పథకాలు: కిషన్ రెడ్డి
ఖమ్మం జిల్లాలో తెలంగాణ భాజపా అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ పర్యటించారు. తెలంగాణ ఉద్యమంలో ఖమ్మం ప్రజల పోరాటం మరవలేనిదని కొనియాడారు.
ఖమ్మం: ఎన్నికల కోసమే సీఎం కేసీఆర్ కొత్త పథకాలు ప్రకటిస్తున్నారని తెలంగాణ భాజపా అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఖమ్మం జిల్లాలో ఇవాళ ఆయన పర్యటించారు. తెలంగాణ ఉద్యమంలో ఖమ్మం ప్రజల పోరాటం మరవలేనిదని కొనియాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్, భారాస పాలన చూశారని.. ఈసారి భాజపాకు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. కమ్యూనిస్టులది అవకాశవాద రాజకీయాలని వ్యాఖ్యానించారు. ‘‘రైతు రుణమాఫీ అమలులో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేసింది. సకాలంలో రుణాలు మాఫీ కాకపోవడంతో రైతులు డిఫాల్టర్లుగా మారారు. వరదలతో రైతులు నష్టపోయినా.. పరిహారం ఇవ్వలేదు. దళితబంధును.. భారాస నాయకుల బంధుగా మార్చారు. మద్యం టెండర్ల ద్వారా వచ్చిన డబ్బుతో ఓట్లు కొనేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అని కిషన్ రెడ్డి ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.