kishan reddy: భాజపా రాష్ట్ర కార్యాలయంలో దీక్ష విరమించిన కిషన్రెడ్డి
కేంద్రమంత్రి, తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో దీక్ష విరమించారు.
హైదరాబాద్: కేంద్ర మంత్రి, తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో దీక్ష విరమించారు. కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జావడేకర్ నిమ్మరసం ఇచ్చి ఆయన చేత దీక్షను విరమింపజేశారు. తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలపై బుధవారం కిషన్రెడ్డి ఇందిరా పార్కు వద్ద 24 గంటల దీక్ష చేపట్టారు. సాయంత్రం 6 గంటల సమయంలో పోలీసులు ఆ ప్రాంగణాన్ని చుట్టుముట్టి ఆయన్ని బలవంతంగా భాజపా రాష్ట్ర కార్యాలయానికి తరలించారు. ధర్నాచౌక్ వద్ద జరిగిన తోపులాటలో కిషన్రెడ్డి చేతికి, ఛాతికి గాయాలు కావడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం మరోసారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరీక్షించారు.
రాబోయే వంద రోజుల్లో మరిన్ని పోరాటాలు : ప్రకాశ్ జావడేకర్
నిరుద్యోగుల తరఫున పోరాటం చేసేందుకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జావడేకర్ అన్నారు. దీక్ష నేపథ్యంలో భాజపా కార్యకర్తలు చూపిన తెగువను ఆయన అభినందించారు. ఇప్పటికే వివిధ సందర్భాల్లో భాజపా సత్తా ఏంటో సీఎం కేసీఆర్కు చూపించామని పేర్కొన్నారు. కిషన్ రెడ్డి శాంతియుతంగా ధర్నా చేసినా అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు. తెలంగాణ యువతను మోసం చేశాననే విషయం కేసీఆర్కు తెలుసు కాబట్టే.. భయంతో పోలీసులను పంపించారని దుయ్యబట్టారు. రాబోయే వంద రోజుల్లో కేసీఆర్ అవినీతి, అక్రమాలను ప్రజలకు తెలియజేసే కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. -
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని రాజంపేట లోక్సభ కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
నాలుగు నెలల్లో 6 గ్యారంటీల్లో చేయాల్సినవి అమలు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి హల్చల్..
ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో శనివారం అర్ధరాత్రి వైకాపా నేతలు దౌర్జన్యం చేశారు. -
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అంకుర సంస్థలు పదేళ్లలో 300రెట్లు పెరిగాయ్: కేంద్రమంత్రి జితేంద్ర సింగ్
-
హైదరాబాద్కు ఘోర పరాభవం.. సొంతగడ్డపై అదరగొట్టిన చెన్నై
-
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
-
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఎంపీ ప్రజ్వల్, రేవణ్ణలపై కేసు