Kishanreddy: కేంద్రం ఇచ్చిన నిధులపై కేటీఆర్తో చర్చకు సిద్ధం: కిషన్రెడ్డి
భారత్ అఫ్గానిస్థాన్గా మారుతుందని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దేశ ప్రతిష్ఠను దిగజార్చే విధంగా ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆక్షేపించారు.
హైదరాబాద్: తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులపై చర్చకు రావాలని రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ విసిరిన సవాలును కేంద్ర మంత్రి కిషన్రెడ్డి స్వీకరించారు. కేసీఆర్ రాజీనామా పత్రాన్ని రాసుకొని కేటీఆర్ వస్తే చర్చించడానికి సిద్ధమని స్పష్టం చేశారు. భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ వ్యాఖ్యలను తెలంగాణ ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. తండ్రిని అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి రాలేదని ఎద్దేవా చేశారు. కుర్ కురే పంపిణీపై కేటీఆర్ మాట్లాడటం అనాథ చిన్నారులను అవమానించడమేనని మండిపడ్డారు. భారత్ అఫ్గానిస్థాన్గా మారుతుందని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దేశ ప్రతిష్ఠను దిగజార్చే విధంగా ఉన్నాయని ఆక్షేపించారు. మమ్మల్ని తిట్టండి కానీ, దేశ ప్రతిష్ఠను మాత్రం దిగజార్చ వద్దని హితవు పలికారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి కానుకగా ఆదివారం ఉదయం వందే భారత్ రైలును కేంద్రం ప్రారంభిస్తుందని కిషన్రెడ్డి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్