PM Modi: ఈసారి కేరళలో కమలం వికసించబోతోంది: ప్రధాని మోదీ
ఈసారి కేరళలో భాజపా కొన్ని లోక్సభ స్థానాలు గెలుచుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తంచేశారు.
పతనంథిట్ట: వచ్చే లోక్సభ ఎన్నిక(Lok Sabha Elections)ల్లో కేరళ నుంచి భాజపా కొన్ని స్థానాలు గెలుచుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) విశ్వాసం వ్యక్తంచేశారు. అవినీతి, అసమర్థ ప్రభుత్వాల వల్ల రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. శుక్రవారం ఎన్డీయే అభ్యర్థుల తరఫున నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మాట్లాడుతూ.. ఈసారి కేరళలో కమలం వికసించబోతోందన్నారు. కేరళలోని వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. అవినీతి, అసమర్థతతో కొట్టుమిట్టాడుతున్న ఆయా ప్రభుత్వాల హయాంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
జగనన్నా.. అంతఃకరణశుద్ధి అంటే అర్థం తెలుసా?: సునీత
వరుసగా ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ప్రభుత్వాల గొలుసు విచ్ఛిన్నమైతేనే ప్రజలకు మేలు జరుగుతుందని ప్రధాని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో కేరళ ప్రజలు భాజపాను రెండంకెల ఓట్ల శాతం కలిగిన పార్టీగా మార్చారనీ.. ఈ ఎన్నికల్లో రెండంకెల సీట్లు సాధించే గమ్యం ఇంకెంతో దూరం లేదన్నారు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ప్రభుత్వాలు రబ్బరు రైతులు పడుతున్న కష్టాలపై కళ్లు మూసుకొని వ్యవహరించాయని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్రమంగా క్షీణిస్తున్నాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. -
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో డ్యామ్ కూలి 40 మంది మృతి
-
ఈ క్రెడిట్ కార్డులతో బిల్లులు చెల్లిస్తున్నారా? మే 1 నుంచి అదనపు ఛార్జీ..!
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
-
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
-
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
-
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య