Andhra News: అన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తా: మేకపాటి విక్రమ్‌రెడ్డి

మేకపాటి గౌతమ్ రెడ్డి మృతితో ఖాళీ అయిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు స్థానంలో వైకాపా అభ్యర్థిగా ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డిని నిలపాలని వైకాపా నిర్ణయించింది. తన రెండో

Published : 29 Apr 2022 02:17 IST

అమరావతి: మేకపాటి గౌతమ్ రెడ్డి మృతితో ఖాళీ అయిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు స్థానంలో వైకాపా అభ్యర్థిగా ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డిని నిలపాలని వైకాపా నిర్ణయించింది. తన రెండో కుమారుడు విక్రమ్ రెడ్డితో తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి.. సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. మేకపాటి గౌతమ్ రెడ్డి వారసుడిగా తన రెండో కుమారుడు విక్రమ్ రెడ్డిని నిర్ణయించినట్లు రాజమోహన్ రెడ్డి సీఎంకు తెలిపారు. నియోజకవర్గానికి వెళ్లేముందు సీఎం జగన్ ఆశీస్సులు తీసుకోవడానికి విక్రమ్‌ని తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూల్ వస్తే మిగతా విషయాలు తెలుస్తాయని.. ఎవరెవరు పోటీలో ఉంటారో తెలుస్తుందని రాజమోహన్‌ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. తన సోదరుడి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. నియోజకవర్గానికి గౌతమ్‌ రెడ్డి చేయాలనుకున్న అన్ని పనులను తాను చేసి చూపిస్తానన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని