KTR: నిజామాబాద్‌ ఎంపీకి అదొక్కటే తెలుసు: కేటీఆర్‌

ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చే నాయకులను ప్రజలు నమ్మొద్దని మంత్రి కేటీఆర్‌ అన్నారు. నిజామాబాద్‌లో పలు అభివృద్ధి పనులను కేటీఆర్‌ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.

Published : 09 Aug 2023 16:35 IST

నిజామాబాద్‌: ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చే నాయకులను ప్రజలు నమ్మొద్దని మంత్రి కేటీఆర్‌ అన్నారు. నిజామాబాద్‌లో పలు అభివృద్ధి పనులను కేటీఆర్‌ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.

‘‘ఒకప్పుడు నెర్రలు వారిన నేలల్లో ఇప్పుడు జలధారలు పారుతున్నాయి. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్‌ను అధిగమించాం. 60 ఏళ్లలో చూడని వాటిని ఈ 9 ఏళ్లలో చూస్తున్నాం. రూ.450 ఉన్నప్పుడు గ్యాస్‌ సిలిండర్‌కు మొక్కాలని ప్రధాని మోదీ అన్నారు. ఇవాళ సిలిండర్‌ ధర రూ.1200కు పెంచారు. పెట్రోల్, డీజిల్‌ ధర పెరగటం వల్లే అన్ని నిత్యావసరాల ధరలు పెరిగాయి. పెద్దలను గౌరవించడం మన సంప్రదాయం. నిజామాబాద్‌ ఎంపీకి పెద్దలను గౌరవించడం తెలియదు. ఆయనకు మతం గురించి మాట్లాడి రెచ్చగొట్టడం ఒక్కటే తెలుసు. ప్రతి దానికి హిందూ, ముస్లిం అని మాట్లాడుతూ విద్వేషాలు పెంచుతున్నారు. అభివృద్ధి చేసేవారిని కులమతాలకు అతీతంగా ప్రజలు గెలిపించాలి’’ అని కేటీఆర్‌ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని