Ponnam Prabhakar: భారాస నేతల మాటలు విడ్డూరంగా ఉన్నాయి: మంత్రి పొన్నం

ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే 2 గ్యారంటీలను అమలు చేశామని, మిగతావి 100 రోజుల్లో పూర్తి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

Published : 11 Dec 2023 15:19 IST

సిద్దిపేట: రైతుబంధుపై భారాస నేతల మాటలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రికి డీసీసీ అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి ఘనస్వాగతం పలికారు. అనంతరం మీడియాతో పొన్నం మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే 2 గ్యారంటీలను అమలు చేశామని, మిగతావి 100 రోజుల్లో పూర్తి చేస్తామని వెల్లడించారు.6 గ్యారంటీలపై భారాస నేతల మాటలు విడ్డూరంగా ఉన్నాయన్నారు.

రైతుబంధు పథకంపై మాజీ మంత్రి హరీశ్‌ రావు చేసిన వ్యాఖ్యలను పొన్నం తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం ఏర్పాటై 10 రోజులు కూడా కాలేదని, అప్పుడే.. రైతుబంధు నిధులు విడుదలలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని విమర్శించడం సరికాదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మాట మీద ఉంటుందని, 100 రోజుల్లో 6 గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. ‘బీసీ బంధు’పై సమీక్షిస్తామన్న ఆయన.. ప్రతి శాఖపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు