Telangana News: పీజీ సీట్లు బ్లాక్ చేసినట్లు నిరూపిస్తే కళాశాలను సరెండర్ చేస్తా: పువ్వాడ అజయ్
పీజీ వైద్య సీట్లు బ్లాక్ చేసినట్లు రేవంత్ రెడ్డి నిరూపిస్తే తన వైద్య కళాశాలను ప్రభుత్వానికి సరెండర్ చేస్తానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ వెల్లడించారు.
హైదరాబాద్: పీజీ వైద్య సీట్లు బ్లాక్ చేసినట్లు రేవంత్ రెడ్డి నిరూపిస్తే తన వైద్య కళాశాలను ప్రభుత్వానికి సరెండర్ చేస్తానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ వెల్లడించారు. ఒకవేళ నిరూపించ లేకపోతే రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని పువ్వాడ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి తన ఆరోపణలు వెనక్కి తీసుకోకపోతే చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని మంత్రి హెచ్చరించారు. పీజీ వైద్య సీట్లు బ్లాక్ చేస్తున్నామంటూ తనపై రేవంత్ రెడ్డి గవర్నర్కు తప్పుడు ఫిర్యాదు చేశారని మండిపడ్డారు. ఖమ్మంలోని మమత మెడికల్ కళాశాలలో 20 ఏళ్లుగా పీజీ ప్రవేశాలు అత్యంత పారదర్శకంగా జరుగుతున్నాయన్నారు. పీజీ ప్రవేశాల కౌన్సెలింగ్ సమయంలోనే తన కళాశాలలో సీట్లన్నీ నిండిపోతాయని చెప్పారు. అలాంటప్పుడు సీట్లు బ్లాక్ చేసి దందా చేయాల్సిన అవసరమే లేదన్నారు. రేవంత్ రెడ్డి ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని.. అవి పూర్తి నిరాధారమన్నారు. తప్పుడు ఆరోపణలతో బట్టకాల్చి మీదేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..