
Telangana News: కేసీఆర్.. ఇక్కడేం సాధించారని దేశవ్యాప్త పర్యటనకు వెళ్లారు?: ఈటల
హైదరాబాద్: తెలంగాణలో సరైన పరిపాలన అందించలేని సీఎం కేసీఆర్.. ఏం సాధించాలని దేశవ్యాప్త పర్యటనకు వెళ్లారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రశ్నించారు. ప్రజల డబ్బుతో ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసుకొని తిరగడానికి వెళ్లిన సీఎంను చూసి రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. గూట్లో రాయి తీయలేనివాడు ఏట్లో రాయి తీస్తా అన్నట్లుగా సీఎం కేసీఆర్ వ్యవహార శైలి ఉందని ఎద్దేవా చేశారు. సొంత రాష్ట్రాన్ని పరిపాలించే సత్తా లేదు.. సమస్యలు పరిష్కరించే దమ్ము లేదు కానీ దేశ రాజకీయాల్లో ఏదో ప్రభావం చూపిస్తానంటూ పోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్కు గుణపాఠం చెప్పకపోతే తెలంగాణకి అరిష్టమని ప్రజలంతా భావిస్తున్నారని ఈటల వ్యాఖ్యానించారు.
‘‘తెలంగాణలో పెన్షన్లు రెండు మూడు నెలలకు ఒకసారి వస్తున్నాయి. సరైన సమయంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదు. మధ్యాహ్న భోజనం వండేవారికి కూడా బిల్లులు చెల్లించడం లేదు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ప్రజలమీద పన్నుల భారం మోపారు. లిక్కర్ మీద రెట్లు పెంచారు. భూముల రిజిస్ట్రేషన్, కరెంటు, బస్సు ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచారు. ఒక్క మాటలో చెప్పాలంటే సంవత్సరానికి రూ.25 వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపారు’’ అని ఈటల విమర్శించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Senegal: సమద్రంలో బోటు బోల్తా.. 13 మంది మృతి, 40మంది గల్లంతు!
-
India News
Udaipur Murder: ‘నన్ను చంపడానికి ప్లాన్.. రక్షించండి’.. హత్యకు ముందు పోలీసులకు దర్జీ ఫిర్యాదు!
-
India News
Jammu: జమ్మూలో మరో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Sports News
Hanuma vihari : మన దగ్గర పోటీ ఎక్కువ.. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్కు సిద్ధమే: హనుమ విహారి
-
Business News
బీచ్లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
-
Crime News
Karnataka: అప్పు తిరిగి చెల్లించలేదని.. అక్కాచెల్లెళ్లను వివస్త్రలను చేసి దాడి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Maharashtra crisis: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా.. గవర్నర్ ఆమోదం
- Allu Arjun: ‘పుష్ప’తో మక్కల్ సెల్వన్ ఢీ.. లెక్కల మాస్టారి స్కెచ్ అదేనా?
- బీచ్లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
- Rajamouli: అలా చేస్తేనే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది: రాజమౌళి
- Udaipur Murder: ‘నన్ను చంపడానికి ప్లాన్.. రక్షించండి’.. హత్యకు ముందు పోలీసులకు దర్జీ ఫిర్యాదు!
- Shivani Rajasekhar: ‘మిస్ ఇండియా’ పోటీ నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. కారణమిదే
- Viral Video: గోల్డ్ స్మగ్లింగ్కు పాల్పడిన చీమలు.. ఏ కేసు పెట్టాలని నెటిజన్లకు అధికారి ప్రశ్న!
- Mahesh babu: బిల్ గేట్స్తో మహేశ్బాబు.. పిక్ వైరల్.. ఎక్కడ కలిశారంటే?
- Karnataka: అప్పు తిరిగి చెల్లించలేదని.. అక్కాచెల్లెళ్లను వివస్త్రలను చేసి దాడి!
- Social Look: కీర్తిసురేశ్ కొత్త లుక్.. శ్రీలీల స్మైల్.. వర్షంలో మౌనీరాయ్!