Gujarat Polls 2022: గుజరాత్ ఎన్నికలు.. మోదీ సరికొత్త నినాదం
గుజరాత్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని మోదీ సరికొత్త నినాదాన్ని అందుకున్నారు.‘‘ గుజరాత్ను నేనే తయారు చేశాను’’ అనే భావన ప్రతి ఒక్కరిలోనూ రావాలన్నారు.
అహ్మదాబాద్: గుజరాత్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని మోదీ సరికొత్త నినాదాన్ని అందుకున్నారు. ‘‘గుజరాత్ను నేనే తయారు చేశాను’’ అనే భావన ప్రతి ఒక్కరిలో రావాలని అన్నారు. ‘‘ ప్రతి గుజరాత్ పౌరుడు గుండెల నిండా ఆత్మవిస్వాంతో ఉంటారు. అందుకే వాళ్లు మాట్లాడిన ప్రతి మాట గుండె లోతుల్లోంచి వస్తుంది. ‘నేను ఈ గుజరాత్ను తయారు చేశాను’.. అనే మాట ప్రతి ఒక్కరిమనస్సులో నాటుకుపోవాలి’’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కాప్రద జిల్లాలోని ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీ రాష్ట్రాన్ని అభాసుపాల్జేస్తోందంటూ పరోక్షంగా కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. గత 20 సంవత్సరాలుగా రాష్ట్ర పరువు తీసేందుకు యత్నిస్తున్న విభజన శక్తులకు గుజరాత్ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని మోదీ వ్యాఖ్యానించారు. ఆదివాసీల అభివృద్ధికి భాజపా కృషి చేస్తోందని అన్నారు.
మరోవైపు, ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకాక ముందు నుంచే అధికార భాజపా ఎన్నికల ప్రచారాన్ని విస్త్రృతం చేసింది. అక్టోబరు 13న అహ్మదాబాద్లో హోంమంత్రి అమిత్షా ‘ గుజరాత్ గౌరవ యాత్ర’ పేరిట ప్రచారం ప్రారంభించారు. ఆ తర్వాతి రోజునే పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మెహ్సనాలో యాత్ర మొదలు పెట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తోపాటు పలువురు నాయకులు కూడా భాగమవుతున్నారు. భాజపా ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ యాత్ర కొనసాగుతోంది. గుజరాత్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబరు 1, 5 తేదీల్లో పోలింగ్ నిర్వహించి, డిసెంబరు 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజ్వల్ రేవణ్న బాధితులకు అండగా నిలుద్దాం
జనతాదళ్(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్న లైంగిక వేధింపులకు గురైన బాధితులందరికీ సాయం అందించాలని, వారికి న్యాయం జరిగే వరకూ అండగా నిలవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు. -
కులగణనకు కట్టుబడి ఉన్నాం: సీఎం
కులగణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, బీసీలకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. -
రిజర్వేషన్లు ఎత్తేస్తామంటున్న భాజపాను ఓడించడమే ఎజెండా
రాజ్యాంగాన్ని రద్దు చేసి, రిజర్వేషన్లు ఎత్తేయాలని కుట్రలు పన్నుతున్న భాజపాను లోక్సభ ఎన్నికల్లో ఓడించడమే ఎజెండాగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఏఐసీసీ ఎస్సీ విభాగం ఛైర్మన్ రాజేష్ లిలోతియా పిలుపునిచ్చారు. -
భారాసకు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ రాజీనామా
భారాసకు రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ ప్రకటించారు. శనివారం దిల్లీలోని తెలంగాణ భవన్లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మరో నలుగురి నామినేషన్
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మూడో రోజు శనివారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
రోహిత్ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి: కూనంనేని
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదంటూ నివేదిక ఇవ్వడం విస్మయం కలిగించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. -
‘సెక్యులర్’ పదం తొలగింపు వ్యాఖ్యలపై మోదీ, అమిత్షా సమాధానం చెప్పాలి: జి.నిరంజన్
భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని ‘సెక్యులర్’ పదాన్ని తొలగిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్కుమార్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలు సమాధానం చెప్పాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
-
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి
-
నిజం చెప్పటమే నేరమా..? 572 మంది ఉపాధ్యాయులకు నోటీసులు
-
బ్రెజిల్ను ముంచెత్తిన వరదలు.. 60 మంది మృత్యువాత
-
మీరూ వద్దు మీ డబ్బూ వద్దు.. వైకాపా తాయిలాలకు తలవంచని ఓటర్లు