Navneet Rana: ‘మరోసారి అలా చేస్తే చంపేస్తా’.. ఎంపీ నవనీత్ రాణాకి హత్యా బెదిరింపులు!
మహారాష్ట్రలో మాతోశ్రీ- హనుమాన్ చాలీసా వివాదంతో వార్తల్లోకెక్కిన అమరావతి ఎంపీ నవనీత్ రాణా.. తాజాగా తనకు ఫోన్లో హత్య బెదిరింపులు వచ్చాయని ఆరోపిస్తూ దిల్లీలో ఫిర్యాదు చేశారు. రాణా బుధవారం ఈ మేరకు పోలీసులను ఆశ్రయించగా...
దిల్లీ: మహారాష్ట్రలో మాతోశ్రీ- హనుమాన్ చాలీసా వివాదంతో వార్తల్లోకెక్కిన అమరావతి ఎంపీ నవనీత్ రాణా.. తాజాగా తనకు ఫోన్లో హత్య బెదిరింపులు వచ్చాయని ఆరోపిస్తూ దిల్లీలో ఫిర్యాదు చేశారు. రాణా బుధవారం ఈ మేరకు పోలీసులను ఆశ్రయించగా.. ఒకరోజు తర్వాత ఎఫ్ఐఆర్ నమోదైంది. నార్త్ అవెన్యూ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు దిల్లీ డీసీపీ అమృత గుగులోత్ గురువారం వెల్లడించారు. ఫిర్యాదు ప్రకారం.. మంగళవారం సాయంత్రం 5.27 నుంచి 5.47 గంటల మధ్య ఎంపీ మొబైల్ నంబర్కు 11 కాల్స్ వచ్చాయి. అవతలి వ్యక్తి అనుచితంగా మాట్లాడినట్లు, దుర్భాషలాడినట్లు, మహారాష్ట్రకు వస్తే చంపేస్తానని బెదిరించినట్లు అందులో పేర్కొన్నారు. మళ్లీ హనుమాన్ చాలీసా పఠిస్తే చంపేస్తానని హెచ్చరించినట్లు తెలిపారు. ఈ వ్యవహారంతో తాను మానసిక వేదనకు గురయ్యాయని ఎంపీ ఫిర్యాదులో పేర్కొన్నారు.
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ఠాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠించి తీరతామంటూ కొద్దిరోజుల క్రితం నవనీత్ రాణా దంపతులు సవాల్ విసిరిన విషయం తెలిసిందే. దీంతో.. రెండు వర్గాల మధ్య కలహాలు చెలరేగేలా వ్యాఖ్యలు చేశారంటూ వారిపై ముంబయి పోలీసులు ఏప్రిల్ 23న రాజద్రోహం కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులపై దాడి చేశారన్న ఆరోపణలపై ఏప్రిల్ 24న రెండో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇరువురిని అరెస్టు చేసిన పోలీసులు.. బాంద్రాలోని మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపరుచగా వారికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని విధించింది. అనంతరం ఈనెల 4న బెయిల్పై విడుదలయ్యారు. ఇదిలా ఉండగా.. ఇటీవల ముంబయి ఖేర్ ప్రాంతంలోని రాణా దంపతుల ఫ్లాట్లో కొంతభాగాన్ని ముంబయి నగరపాలక సంస్థ అక్రమ నిర్మాణంగా తేల్చింది. దాన్ని వారం రోజుల్లోగా తొలగించాలని.. లేని పక్షంలో ఆ పని తామే చేస్తామని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్