Nara Lokesh: కూటమి అధికారంలోకి రాగానే పోలీసు నియామకాలు: నారా లోకేశ్‌

తెదేపా-జనసేన-భాజపా కూటమి అధికారంలోకి రాగానే పోలీసు నియామకాలు చేపడతామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు.

Updated : 25 Mar 2024 15:17 IST

అమరావతి: తెదేపా-జనసేన-భాజపా కూటమి అధికారంలోకి రాగానే పోలీసు నియామకాలు చేపడతామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. తాడేపల్లిలో ఫైన్‌ ఉడ్‌ అపార్టుమెంట్‌ వాసులతో నిర్వహించిన ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. ‘‘ఐదేళ్లుగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం. శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు. వాళ్లు గొడవలు సృష్టిస్తారు.. ఓర్పు, సహనంతో అందరూ ఓటు వేయాలి. మీ ఓటును ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోండి. ఎందుకంటే జగన్‌ను మించిన దొంగ లేరు. సొంత బాబాయ్‌ని చంపి ఆ నింద మాపై వేశారు. ఐదు సంవత్సరాల తర్వాత నిజం బయటకు వచ్చింది. తెదేపా హయాంలో మంగళగిరి ఆటోనగర్‌లో ఐటీ కంపెనీలు తీసుకొచ్చాం. సుమారు 2 వేల మంది వీటిలో ఉపాధి పొందుతున్నారు. అధికారంలోకి వచ్చాక మరింత అభివృద్ధి చేస్తాం. స్వర్ణకారుల కోసం సెజ్‌ ఏర్పాటు చేస్తాం’’ అని నారా లోకేశ్‌ అన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని