Nara Lokesh: జగన్.. కుర్చీ ఇలా మడతపెట్టి సీటు లేకుండా చేస్తాం: నారా లోకేశ్
పసుపు సైన్యం, జనసైనికుల జోలికి వైకాపా నేతలు వస్తే ఊరుకునేది లేదని తెదేపా (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు.
నెల్లిమర్ల: పసుపు సైన్యం, జనసైనికుల జోలికి వైకాపా నేతలు వస్తే ఊరుకునేది లేదని తెదేపా (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో నిర్వహించిన ‘శంఖారావం’ సభలో ఆయన మాట్లాడారు. మీరు చొక్కాలు మడతపెడితే.. మేం మీ కుర్చీ మడత పెట్టి సీటు లేకుండా చేస్తామని సీఎం జగన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎలా చేస్తామో చూపిస్తామంటూ ఓ కుర్చీని మడతపెట్టి చూపించారు. ఈ సమయంలో తెదేపా, జనసేన కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది.
‘‘రాజధాని ఫైల్స్ సినిమా, రైతులంటే జగన్కు భయమేస్తోంది. ఆ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్దకు పోలీసులను పంపారు. మూడు రాజధానులన్నారు.. ఉత్తరాంధ్రలో ఒక్క ఇటుకైనా వేశారా? మూడు ముక్కలాట ఆడుతున్న వైకాపాకు ప్రజలే బుద్ధి చెబుతారు. మద్యపాన నిషేధం చేశాకే ఓటు అడుగుతానన్న జగన్.. ఇప్పుడేం చెబుతారు? ఆ దుకాణాల వద్ద చర్చ పెట్టుకుందాం.. అక్కడికి వచ్చేందుకు సిద్ధమా? ప్రభుత్వమే అధికారులను నియమించి టార్గెట్ పెడుతోంది. ఐదేళ్లుగా విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు పెంచుకుంటూ వెళ్తున్నారు. ఈ ప్రభుత్వం సాక్షి క్యాలెండర్ తప్ప.. జాబ్ క్యాలెండర్ ఇచ్చిందా?యువత నిలదీస్తారని పరదాలు కట్టుకుని సీఎం తిరుగుతున్నారు. జగన్ అద్భుతమైన స్కామ్ స్టార్. ఎన్నికల ముందు ఇళ్లు కాదు.. ఏకంగా పట్టణాలు కడతామన్నారు. అధికారంలోకి వచ్చాక దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు’’ అని లోకేశ్ విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. -
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు -
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు