Sanjay Raut: త్వరలో మహారాష్ట్రకు కొత్త సీఎం: సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యలు

మహారాష్ట్రలో చోటుచేసుకున్న తాజా రాజకీయ పరిణామంతో సీఎం ఏక్‌నాథ్‌ శిందే పదవికి గండం మొదలైనట్టేనని శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్‌ రౌత్‌ అన్నారు.

Published : 02 Jul 2023 18:03 IST

ముంబయి: ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌(Ajit pawar) వర్గం మహారాష్ట్రలోని ఎన్డీయే ప్రభుత్వంలో చేరడంపై శివసేన (యూబీటీ) సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌(Sanjay Raut) స్పందించారు. ఈ అనూహ్య పరిణామాన్ని ఏక్‌నాథ్‌ శిందే తన సీఎం పదవి కోల్పోవడానికి నాందిగా అభివర్ణించారు. త్వరలోనే మహారాష్ట్రకు కొత్త సీఎం వస్తారంటూ వ్యాఖ్యానించారు. అజిత్‌ పవార్‌ డిప్యూటీ సీఎంగా, మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం మహారాష్ట్ర రాజకీయాలను కీలక మలుపు తిప్పిన విషయం తెలిసిందే. ఈ పరిణామంపై ఎంపీ సంజయ్‌ రౌత్‌ స్పందిస్తూ.. అజిత్‌ పవార్‌ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయడం ఏక్‌నాథ్‌ శిందే తన పదవిని కోల్పోయే ప్రక్రియ మొదలైనట్టే.. ఆయన వర్గం ఎమ్మెల్యేలు సభలో అనర్హతకు గురవుతారు. ఆ తర్వాత ప్రభుత్వానికి ఇబ్బందులు లేకుండా అజిత్‌ పవార్‌, ఎన్సీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో చేరారు’’ అని రౌత్‌ అన్నారు.  ఈ పరిణామాన్ని ట్రిపుల్‌ ఇంజిన్‌ సర్కార్‌గా చూడరాదని.. రెండు ఇంజిన్లలో ఒకటి ఫెయిలవుతోందంటూ వ్యాఖ్యానించారు. అయితే, ఈ పరిణామం గురించి ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌కు తెలుసా అని విలేకర్లు ఆయన్ను ప్రశ్నించగా.. ఆయనకు మొత్తం సమాచారం ఉందంటూ రౌత్‌ బదులిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని