థర్డ్వేవ్.. అజాగ్రత్తగా ఉంటే కష్టమే: కేంద్రం
దేశంలో కరోనా రెండోదశ వ్యాప్తి ఇప్పుడిప్పుడే కాస్త అదుపులోకి వస్తోంది. గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ప్రజలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని, ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఏప్రిల్, మే నెలల్లో ఎదురైన పరిస్థితులు మళ్లీ తప్పవని కేంద్రం హెచ్చరించింది. మూడో దశ వ్యాప్తి మొదలైతే నష్టం మరింత తీవ్రంగా ఉంటుందని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ హెచ్చరించారు. వైరస్ ఇంకా పూర్తగా అదుపులోకి రాలేదని,..
దిల్లీ: దేశంలో కరోనా రెండోదశ వ్యాప్తి ఇప్పుడిప్పుడే కాస్త అదుపులోకి వస్తోంది. గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని, ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఏప్రిల్, మే నెలల్లో ఎదురైన పరిస్థితులు మళ్లీ తప్పవని కేంద్రం హెచ్చరించింది. మూడో దశ వ్యాప్తి మొదలైతే నష్టం మరింత తీవ్రంగా ఉంటుందని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ హెచ్చరించారు. వైరస్ ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదని, మహమ్మారి తన రూపాన్ని మార్చుకుంటున్నందున మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరముందని ఆయన అన్నారు. లేని పక్షంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు.
కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం మే 7న నమోదైన అత్యధిక కేసులను పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుతం 68 శాతం మేర పాజటివ్ కేసులు తగ్గినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 377 జిల్లాల్లో కేవలం 5 శాతం కంటే తక్కువ కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. మరో 257 జిల్లాల్లో దాదాపు 100 చొప్పున కొత్త కేసులు వస్తున్నాయి. దీనిని బట్టి వైరస్ ఉద్ధృతి కాస్త తగ్గిందనే చెప్పాలి. అయితే ఇది ఒక్క రోజులో వచ్చిన మార్పేమీ కాదని, వివిధ రాష్ట్రాల్లో లాక్డౌన్ అమల్లో ఉండటం వల్ల జన సంచారం బాగా తగ్గిందని, క్రమంగా వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చిందని వీకే పాల్ అభిప్రాయపడ్డారు. ‘‘వైరస్ ఉద్ధృతి తగ్గింది కదా అని.. జనవరి, ఫిబ్రవరి నెలల్లో తిరిగినట్లు బయట తిరగొద్దు. అలా చేస్తే మహమ్మారి ప్రళయం సృష్టిస్తుంది. గణితశాస్త్ర పరంగానూ ఇది నిరూపితమైంది. సెకెండ్ వేవ్ కంటే థర్డ్ వేవ్ మరింత వేగంగా విస్తరిస్తుంది. వీలైనంత వరకు బహిరంగ ప్రదేశాల్లో తిరగడం తగ్గించాలి. ఈలోగా సాధ్యమైనంత ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ చేపట్టాలి’’ అని వీకే పాల్ అన్నారు.
మరోవైపు భారత్లో కరోనా మూడో విడత ముప్పు పొంచి ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే ఎప్పుడు వస్తుందన్న దానిపై స్పష్టత లేదు. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ తదితర అంశాలపై ఇది ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. మూడో దశ వ్యాప్తిలో చిన్నారులపై అధిక ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఆదిశగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. మూడోముప్పు ఎప్పుడు సంభవించినా సంసిద్ధంగా ఉండేలా ప్రణాళికలు రచించుకుంటున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..