Stalin: ప్రధాని అభ్యర్థి గురించి నిర్ణయం తీసుకోలేదు.. కానీ..!: చెన్నైలో స్టాలిన్
పట్నా భేటీలో విపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్థిత్వంపై నిర్ణయం తీసుకోలేదని తమిళనాడు సీఎం స్టాలిన్(stalin) అన్నారు.
చెన్నై: బిహార్లోని పట్నాలో జరిగిన విపక్షాల భేటీలో ప్రధాని అభ్యర్థిత్వంపై నిర్ణయం తీసుకోలేదని తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్(MK Stalin) తెలిపారు. కానీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా(BJP)ను ఓడించేందుకు అన్ని ప్రజాస్వామిక శక్తుల్ని ఏకం చేయాలని తీర్మానం చేసినట్టు వెల్లడించారు. పట్నాలో నీతీశ్ కుమార్(Nitish kumar) ఆధ్వర్యంలో నిర్వహించిన విపక్షాల భేటీకి 15 రాజకీయ పార్టీల ముఖ్య నేతలు హాజరైన విషయం తెలిసిందే. ఈ భేటీ అనంతరం చెన్నైకి చేరుకున్న స్టాలిన్ అక్కడి విలేకర్లతో మాట్లాడారు. భాజపాను మళ్లీ అధికారంలోకి రాకుండా చేయాలనే విషయంలో ఈ భేటీలో పాల్గొన్న అన్ని పార్టీల నేతలూ స్పష్టతతో ఉన్నారన్నారు.
భాజపాను ఓడించడమే లక్ష్యంగా పార్టీలన్నీ గట్టిగా నిలబడాలని తాను ఈ సందర్భంగా నొక్కి చెప్పినట్టు తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో ప్రభావం చూపే పార్టీ నాయకత్వంలో కూటమిని ఏర్పాటు చేయడంతో పాటు తాను మొత్తం ఏడు సూచనల్ని ఈ సమావేశం ముందు ఉంచాననీ.. అది సాధ్యపడకపోతే సీట్ల పంపకం గురించి ఆలోచించవచ్చని చెప్పినట్టు స్టాలిన్ తెలిపారు. ఎన్నికల అనంతరం పొత్తు ప్రసక్తి ఉండరాదని.. కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని అంగీకరించాలన్నారు. అలాగే అవసరమైన చోట్ల ఉమ్మడి అభ్యర్థులను ప్రతిపాదించాలని సూచించినట్టు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. ప్రజల భూములు కొట్టేసే నల్ల చట్టమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. -
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. -
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్