ఎస్పీ నుంచి అఖిలేశ్.. కాంగ్రెస్ నుంచి అఖిలేశ్.. స్వతంత్రుడిగా అఖిలేశ్.. ఏంటీ గందరగోళం?
Up elections 2022: ఈసారి యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో ఉన్నది ఒకరు కాదు.. నలుగురు అఖిలేశ్ యాదవ్లు.
ఇంటర్నెట్ డెస్క్: ‘యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేశ్ యాదవ్ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు?’.. ఎవరైనా ఈ ప్రశ్న అడిగితే ఠక్కున.. ‘ఇంకే పార్టీ సమాజ్వాదీ పార్టీ నుంచేగా. అయినా, ఆ పార్టీ అధ్యక్షుడు వేరే పార్టీ నుంచి పోటీచేస్తారా?’ అని తిరిగి విరుచుకుపడకండి. ఎందుకంటే మీరు ఈ కథనం చదివాక మీరు చెప్పే సమాధానం తప్పు కావొచ్చు. కారణం ఈసారి యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో ఉన్నది ఒకరు కాదు.. నలుగురు అఖిలేశ్ యాదవ్లు కాబట్టి!! సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ను పక్కన పెడితే.. మిగిలిన ముగ్గురిలో ఒకరు ఎస్పీ.. మరొకరు కాంగ్రెస్.. ఇంకొకరు స్వతంత్ర అభ్యర్థిగా ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆగండాగండి ఒక్క పేర్లతోనే అయిపోలేదు.. ఇంకా చాలా ఉన్నాయ్!
1| యూపీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు సమాజ్వాదీ పార్టీ నుంచి ఓ ప్రకటన. ఈ సారి ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తున్నారన్నది దాని సారాంశం. ప్రస్తుతం అజంగఢ్ ఎంపీగా ఉన్న ఆయన.. ఎస్పీకి మంచి పట్టున్న కర్హల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఈ స్థానానికి ఎన్నిక పూర్తయ్యింది. ఇదీ అఖిలేశ్ యాదవ్-1 కథ. ఇక మిగిలిన ముగ్గురి సంగతి చూద్దాం.
2| అఖిలేశ్ యాదవ్ పేరుతో పోటీ చేస్తున్న మరో వ్యక్తి కూడా సమాజ్వాదీ పార్టీకి చెందిన వారే. ప్రస్తుతం ఈయన ముబారక్పూర్ నుంచి పోటీలో ఉన్నారు. చివరి దశలో ఈ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఈయన విషయంలో కొన్ని ఆసక్తికర పరిణామాలు జరిగాయి. 2017లో జరిగిన ఎన్నికల్లో ఈయన బీఎస్పీ అభ్యర్థి చేతిలో స్వల్ప తేడాతో ఓటమి చవిచూశారు. దీంతో ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎస్పీ అధినేత పేరుతోనే బరిలోకి దిగుతున్న తనకు ప్రజల నుంచి మద్దతు ఉందని చెబుతున్నారు. ‘సీఎంగా ఆ అఖిలేశ్.. ముబారక్పూర్లో ఈ అఖిలేశ్’ అంటూ తన విజయం గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నారని ఈ అఖిలేశ్ యాదవ్ చెబుతున్నారు. ఈ అఖిలేశుడి పేరు వెనకా ఓ ఆసక్తికర అంశం ఉంది. ఈయనకు ముగ్గురు సోదరులు. వారి పేర్లు- అవదేశ్ యాదవ్, ఉమేశ్ యాదవ్, అమరేశ్ యాదవ్. ముగ్గురి పేర్లలోనూ ‘యేశ్’ కామన్గా ఉండడంతో వీరి తండ్రి ఈయనకు అఖిలేశ్ అని పేరుపెట్టారట. అంతేకాదండోయ్! పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఈ అఖిలేశ్ పేరు చూసి కొందరు ఎస్పీ అధినేత రెండు చోట్ల పోటీ చేస్తున్నారనుకుని పొరపడ్డారట!
3| అఖిలేశ్ పేరుతో పోటీచేస్తున్న ఇంకో వ్యక్తి కాంగ్రెస్ నుంచి బికాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో ఈయన సైతం సమమాజ్వాదీ పార్టీకి చెందిన వారే. 2016లో కాంగ్రెస్లో చేరారు. ఈయన విషయంలోనూ ఓ సరదా సందర్భం ఉంది. ‘ఓ రోజు అఖిలేశ్ భయ్యా జిందాబాద్ అంటూ మా పార్టీ అనుచరులు నినాదాలు చేశారు. అక్కడే ఉన్న కొందరు ఎస్పీ మద్దతుదారులు సైతం నాకు అనుకూలంగా నినాదాలు చేశారు. కాసేపటికి విషయం తెలుసుకుని నినాదాలను విరమించుకున్నారు’’ అంటూ ఎన్నికల ప్రచారంలో చోటుచేసుకున్న సరదా సందర్భాన్ని పంచుకున్నారు. కొందరైతే సమాజ్వాదీ పార్టీ గుర్తు హస్తం (కాంగ్రెస్ గుర్తు) ఎప్పుడైందా? అని ఆశ్చర్యపోయినవారూ ఉన్నారంటూ చెప్పుకొచ్చారు.
4| ఇక చివరి వ్యక్తి. గున్నౌర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మరో అఖిలేశ్ యాదవ్ అసలు పేరు లఖ్వేంద్ర సింగ్. పుట్టినప్పుడు అదే పేరుపెట్టినప్పటికీ తన నాయనమ్మ తనను అఖిలేశ్ యాదవ్ అనే పిలవడం ప్రారంభించిదంట. దాంతో అందరూ అలానే పిలవడం మొదలు పెట్టారట. దీంతో అదే పేరుతో తాను నామినేషన్ దాఖలు చేసినట్లు లఖ్వేంద్రసింగ్ తెలిపారు. ఇక్కడా ఓ ట్విస్ట్ ఉందండోయ్! ఈయన పోటీచేస్తున్న స్థానంలో ఎస్పీ తరఫున పోటీ చేస్తున్నది రామ్ ఖిలారీ సింగ్. ఆయన ఈ అఖిలేశుడికి తండ్రే. తాను కేవలం ఓ డమ్మీ అభ్యర్థి మాత్రమేనని చెప్పుకొచ్చారు. హమ్మయ్య! ఇదీ కథ. ఇంతకీ మార్చి 10న వెలువడే ఫలితాల్లో ఎంతమంది అఖిలేశులు విజయం సాధిస్తారో చూడాలి మరి! ఇంతకీ ఈ పేర్ల గోల వింటే మీకేం గుర్తోస్తోంది?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..