Rahul Gandhi: 2024 ఫలితాలు ఆశ్చర్యపరుస్తాయ్..: రాహుల్ గాంధీ
వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ప్రభుత్వం ఓటమి ఖాయమని రాహుల్ గాంధీ (Rahul Gandhi) ధీమా వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల ఫలితాలు ప్రజలను ఆశ్చర్యపరుస్తాయన్నారు.
వాషింగ్టన్: ప్రస్తుతం భారత రాజకీయాల్లో ప్రతిపక్షాలు చాలా ఐక్యంగా ఉన్నాయని కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలు ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తాయని ఆయన విపక్షాల (Opposition) విజయంపై ధీమా వ్యక్తం చేశారు. అమెరికా (USA) పర్యటనలో ఉన్న రాహుల్.. తాజాగా వాషింగ్టన్లోని నేషనల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
‘‘వచ్చే రెండేళ్లలో కాంగ్రెస్ (Congress) పార్టీ మరింత బలోపేతం అవుతుందని నేను విశ్వసిస్తున్నా. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ విజయం సాధించి భాజపాను గద్దె దించింది. త్వరలో జరగబోయే మూడు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కూడా చూడండి. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలు (2024 General elections) ఎలా ఉండబోతున్నాయనే దానిపై ఈ రాష్ట్రాల ఫలితాలు స్పష్టమైన సంకేతాలిస్తాయి. ఇప్పుడు భారత్లో ప్రతిపక్షాలు మరింత ఐక్యంగా ఉన్నాయి. విపక్ష పార్టీలతో కాంగ్రెస్ విస్తృతంగా సమావేశాలు జరుపుతోంది. విపక్షాల ఐక్యత సరైన మార్గంలో వెళ్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కచ్చితంగా ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తాయి’’ అని రాహుల్ (Rahul Gandhi) తెలిపారు.
ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోదీ (PM Modi)కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాపులారిటీ గురించి ప్రశ్నించగా.. ‘‘దేశంలోని అన్ని సంస్థలపై ప్రభుత్వం నియంత్రణ ఉంది. పత్రికారంగంపైనా వారు పట్టుబిగించారు. అయితే ఆ వార్తలను నేను ఎప్పటికీ నమ్మబోను’’ అని రాహుల్ సమాధానమిచ్చారు. ఇక, ఈ సందర్భంగా మీడియా స్వేచ్ఛ గురించి స్పందిస్తూ.. ‘‘ప్రజాస్వామ్య వ్యవస్థకు మీడియా స్వేచ్ఛ అత్యంత కీలకమైనది. విమర్శలను హుందాగా స్వీకరించాలి. కానీ, భారత్లో ఈ స్వేచ్ఛను బలహీనపరుస్తున్నారు. మీడియాపై నిర్బంధం ఉంది’’ అని భాజపా సర్కారుపై రాహుల్ విమర్శలు గుప్పించారు. అయితే, రాహుల్ వ్యాఖ్యలను భాజపా నేతలు ఖండిస్తున్నారు. కాంగ్రెస్ నేత విదేశీ గడ్డపై భారత ప్రతిష్ఠను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?