ఆ సర్టిఫికెట్లపైనా ప్రధాని ఫొటో వేయండి..!
ఎన్డీయే బిహార్ కూటమిలో ఫొటోల రగడ మొదలైంది. కరోనా కట్టడిలో భాగంగా చేపట్టిన వ్యాక్సినేషన్కు సంబంధించిన సర్టిఫికెట్లపై ప్రధాని మోదీ ఫొటో ఉండటంపై బిహార్ మాజీ ముఖ్యమంత్రి,
పట్నా: ఎన్డీయే బిహార్ కూటమిలో ఫొటోల రగడ మొదలైంది. కరోనా కట్టడిలో భాగంగా చేపట్టిన వ్యాక్సినేషన్కు సంబంధించిన సర్టిఫికెట్లపై ప్రధాని మోదీ ఫొటో ఉండటంపై బిహార్ మాజీ ముఖ్యమంత్రి, హిందుస్థానీ ఆవామ్ మోర్చా(హెచ్ఏఎమ్) అధ్యక్షుడు జితన్ రామ్ మాంఝీ ట్విటర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. సర్టిఫికెట్లపై ఫొటోలు ప్రచురించడం ద్వారా టీకా పంపిణీతో వచ్చే ప్రతిష్ఠను తన ఖాతాలో వేసుకొనేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. కరోనాతో మృతి చెందినవారి మరణ ధ్రువీకరణ పత్రాలపైనా ప్రధాని ఫొటో వేయాలని ఎద్దేవా చేస్తూ ట్వీట్
చేశారు. ఛత్తీస్గఢ్, రాజస్థాన్, ఝార్ఖండ్ లాంటి భాజపాయేతర పార్టీ పాలిత రాష్ట్రాల్లోనూ ఫొటో రాజకీయాలు జోరందుకున్నాయి. తాము కూడా ఇతర దేశాల నుంచి వ్యాక్సిన్లను తెప్పించేందుకు కృషి చేశామని, దీంతో వచ్చే ప్రతిష్ఠ తమకూ దక్కాలని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరుకుంటున్నారు. బిహార్కు అత్యవసర ఔషధాలు, టీకాలు, ఆక్సిజన్, నిధుల కేటాయింపులో కేంద్రం ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని ఇటీవల మాంఝీ విమర్శలు చేశారు. ‘‘మేము అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు నెలకు రూ.5 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని 2020 ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చాం. లాక్డౌన్తో రాష్ట్ర ప్రజలు ఆర్థికంగా కుదేలయ్యారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. హామీ ఇచ్చిన ప్రకారం రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు భృతిని మంజూరు చేయాలని సీఎం నీతీశ్ కుమార్ను కోరాను’’ అని మాంఝీ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. -
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని రాజంపేట లోక్సభ కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
నాలుగు నెలల్లో 6 గ్యారంటీల్లో చేయాల్సినవి అమలు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి హల్చల్..
ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో శనివారం అర్ధరాత్రి వైకాపా నేతలు దౌర్జన్యం చేశారు. -
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్కు ఘోర పరాభవం.. సొంతగడ్డపై అదరగొట్టిన చెన్నై
-
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
-
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఎంపీ ప్రజ్వల్, రేవణ్ణలపై కేసు
-
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియామకం