Rahul Gandhi: ‘రివర్స్ గేర్లో మోదీ బండి.. పైగా బ్రేకులూ ఫెయిలయ్యాయి’
దేశవ్యాప్తంగా వంటగ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే వాణిజ్యావసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరనూ ఒక్కోదానిపై దాదాపు రూ.268 చొప్పున పెంచారు. మరోవైపు సామాన్యులు ఈ...
ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా వంటగ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే వాణిజ్యావసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరనూ ఒక్కోదానిపై దాదాపు రూ.268 చొప్పున పెంచారు. మరోవైపు సామాన్యులు ఈ ధరలతో గగ్గోలు పెడుతున్నారు! ప్రతిపక్షాలూ మండిపడుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం వంట గ్యాస్ ధరల భారం విషయంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రస్తుత చర్యలన్నీ అభివృద్ధి మాటలకు దూరంగా ఉన్నాయని పేర్కొన్నారు. సిలిండర్ల ధరలు భరించలేక.. లక్షలాది కుటుంబాలు మళ్లీ కట్టెల పొయ్యి వెలిగించాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి వాహనం రివర్స్ గేర్లో ప్రయాణిస్తోంది.. పైగా దాని బ్రేకులు కూడా ఫెయిలయ్యాయని ఎద్దేవా చేశారు. వంట గ్యాస్ ధరల కారణంగా చాలామంది మళ్లీ కట్టెల పొయ్యి వైపు మళ్లుతున్నారంటూ వచ్చిన కథనాన్ని ఉటంకిస్తూ.. రాహుల్ గాంధీ శనివారం ఈ మేరకు ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా.. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో లీటరు పెట్రోల్పై రూ.5, డీజిల్పై రూ.10 చొప్పున తగ్గింది. ఆయా రాష్ట్రాలూ వ్యాట్ తగ్గింపునకు ముందుకు రావడంతో.. వినియోగదారులకు కాస్త ఉపశమనం లభించినట్లయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?