Purandeswari: జనసేనతో కలిసే ఎన్నికలకు..: దగ్గుబాటి పురందేశ్వరి

ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని గాలికొదిలేసిన రాష్ట్ర ప్రభుత్వం కక్ష పూరిత రాజకీయాలతో కాలం గడుపుతోందని భాజపా ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి విమర్శించారు.

Published : 17 Nov 2023 12:49 IST

నెల్లూరు: ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని వైకాపా ప్రభుత్వం గాలికొదిలేసి కక్ష పూరిత రాజకీయాలతో కాలం గడుపుతోందని భాజపా ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని ప్రశ్నిస్తే.. ఇతర పార్టీలతో సంబంధాలు అంటగట్టడం దారుణమన్నారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

ఇవి పోలీసు హత్యలు కావా?

‘‘రాష్ట్రంలో జరుగుతున్న అన్ని కార్యక్రమాలకు కేంద్రమే నిధులిస్తోంది. వైకాపా ప్రభుత్వం సొంతంగా చేస్తున్న పని ఒక్కటీ లేదు. ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని ప్రశ్నించడం విపక్షాల హక్కు. రాష్ట్రంలో గతుకుల రోడ్లతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. పనులు చేసిన గుత్తేదారులకు బిల్లులు ఇవ్వడం లేదు.  రోడ్ల పరిస్థితిపై సోషల్‌ మీడియాలో జోకులు వస్తున్నాయి. రైతులను వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో భాజపా, జనసేన కలిసే వెళ్తాయి. ఏపీలో కుంభకోణాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది’’ అని  పురందేశ్వరి అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు