BJP: జితేందర్రెడ్డి, రంజిత్రెడ్డి ఏ లబ్ధికి కాంగ్రెస్లోకి వెళ్లారు?: రఘునందన్రావు
భాజపా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, భారాస ఎంపీ రంజిత్ రెడ్డి పార్టీ మారడం వెనుక రూ.వందల కోట్లు చేతులు మారుతున్నాయని భాజపా మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు.
హైదరాబాద్: మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి (భాజపా), రంజిత్ రెడ్డి (భారాస) పార్టీ మారడం వెనుక రూ.వందల కోట్లు చేతులు మారుతున్నాయని మాజీ ఎమ్మెల్యే, మెదక్ భాజపా అభ్యర్థి రఘునందన్రావు ఆరోపించారు. వారిద్దరూ ఆ డబ్బులతో కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ చేయబోతున్నారని చెప్పారు. నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
‘‘రాష్ట్రంలో ఎన్నికల వేళ నేతలు తమ అవసరాలకు అనుకూలంగా పార్టీలు మారుతున్నారు. భాజపాలో చేరిన సమయంలో పార్టీ గురించి అద్భుతంగా మాట్లాడి.. వీడాక ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నారు. జితేందర్ రెడ్డి కుమారుడికి భాజపా టికెట్ ఇస్తే సిద్ధాంతాలు ఉన్న పార్టీ, టికెట్ రాకపోతే సిద్ధాంతాలు లేని పార్టీనా? జితేందర్, రంజిత్ రెడ్డి కాంగ్రెస్లో చేరడం వెనుక ఉన్న రహస్యాలు మాకు తెలుసు. ఏ లబ్ధి కోసం వాళ్లు కాంగ్రెస్లోకి వెళ్లారో చెప్పాలి? షేక్పేటలో జరుగుతోన్న భూ బాగోతాలపై ఈడీకి, ఐటీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తాం ’’ అని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కాలేయానికి అధిక కొవ్వు ముప్పు.. వర్క్ ఫ్రం హోం తర్వాత పెరిగిన కేసులు
-
‘అమ్మో జగన్ బొమ్మా’ళీ.. అడ్డగోలుగా ఫైబర్నెట్ ధరల పెంపు!
-
అన్నకు నచ్చని తమ్ముడి పెళ్లి.. యువతి అమ్మమ్మ ఇంటికి నిప్పుపెట్టిన ప్రబుద్ధుడు
-
ఆసుపత్రికెళ్తే.. విసనకర్ర, కొవ్వొత్తి తీసుకెళ్లాల్సిందే!
-
‘మా అమ్మాయికి కాళ్లే చచ్చుబడ్డాయి.. ఏపీలో వ్యవస్థే చచ్చుబడింది’
-
ఒక్క ఫోటో .. నాలుగేళ్ల కష్టం