విజయసాయి వ్యాఖ్యలపై వెంకయ్య మనస్తాపం
రాజ్యసభలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఉపరాష్ట్రపతి, ఛైర్మన్ వెంకయ్యనాయుడు తీవ్ర మనస్తాపం చెందారు. తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్
దిల్లీ: రాజ్యసభలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు తీవ్ర మనస్తాపం చెందారు. తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ చేసిన ఆరోపణలపై విజయసాయిరెడ్డి సభలో పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరగా.. లిఖిత పూర్వకంగా వివరాలు ఇస్తే పరిశీలిస్తానని వెంకయ్య చెప్పారు. ఆ జవాబుతో సంతృప్తి చెందకుండా ఆయన నిష్పాక్షికతను ప్రశ్నిస్తూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ ఛైర్మన్ స్పందిస్తూ విజయసాయి వ్యాఖ్యలు రికార్డుల్లోకి వెళ్లవని చెప్పారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ కలగజేసుకుని విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయనతో పలువురు సభ్యులు గళం కలిపారు. అనంతరం వెంకయ్య మాట్లాడుతూ తన నిష్పాక్షికతను ప్రశ్నించడం బాధించిందని.. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు. తాను పనిచేయకుండా ఉండేందుకే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని చెప్పారు. ఎన్ని విమర్శలు చేసినా తన విధులు తాను నిర్వర్తిస్తానన్నారు. ఉపరాష్ట్రపతి పదవికి ముందే భాజపాకు రాజీనామా చేశానని.. రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నానని గుర్తు చేశారు. తన హృదయం దేశ ప్రజలతో మమేకమై ఉందని.. ఎవరేమన్నా పట్టించుకోనని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..