Revanth Reddy: దేశం గర్వించేలా పతకాలు తెచ్చిన వారికి రివార్డ్‌ ఇదేనా?: రేవంత్‌

ఒలింపిక పతక విజేతలు, ఇతర రెజ్లర్‌లపై దిల్లీ పోలీసులు ప్రవర్తించిన తీరును టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు.

Updated : 04 May 2023 15:21 IST

హైదరాబాద్‌: ఒలింపిక పతక విజేతలు, ఇతర రెజ్లర్‌లపై దిల్లీ పోలీసులు ప్రవర్తించిన తీరును టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. అర్ధరాత్రి వారిపై దురుసుగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు రేవంత్‌ ఆయన ట్వీట్‌ చేశారు.

‘‘మహిళా సాధికారతపై భాజపా బూటకపు మాటలు చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆందోళకారులపై తన బలాన్ని ప్రయోగిస్తోంది. కానీ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? పతకాలు తెచ్చి దేశం గర్వించేలా చేసినందుకు వారికి ప్రభుత్వం ఇస్తున్న రివార్డ్‌ ఇదేనా?’’ అని రేవంత్‌ నిలదీశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని