Revanthreddy: ఏక్నాథ్ శిందేలను తయారు చేసింది కేసీఆర్ కాదా?: రేవంత్రెడ్డి
అకాల వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం అయినా యుద్ధ ప్రాతిపదికన
హైదరాబాద్: అకాల వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం అయినా యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలి. కానీ, ఈ విషయాన్ని గాలికొదిలేసి.. సీఎం కేసీఆర్ ప్రెస్మీట్లతో కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్కు దుర్యోధనుడు పూనినట్టు వ్యవహరించారని ఎద్దేవా చేశారు.
‘‘కేసీఆర్ మాటల్లో కొత్తేమీ లేదు.. వింతేమీ లేదు. పై ఆదేశాల ప్రకారమే అలా మాట్లాడారు. కేసీఆర్ తన గురించి గొప్పలు చెప్పుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన చేస్తున్న దానికి, చెబుతున్న దానికి ఏమైనా సంబధం ఉందా? కేసీఆర్ చెప్పింది నిజమే.. మోదీ వల్ల ప్రజాస్వామ్యానికే ముప్పు ఉంది. కానీ, మోదీకి గురువు కేసీఆర్. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కేసీఆర్ లాక్కున్నప్పుడు ఇవన్నీ మర్చిపోయారా? తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏక్నాథ్ శిందేల ఉత్పత్తి ప్రారంభించింది కేసీఆర్ కాదా? ప్రతిపక్ష పార్టీలో గెలిచిన తలసాని శ్రీనివాస్ను తెరాసలో చేర్చుకుని మంత్రిని చేసింది కేసీఆర్ కాదా? ఎర్రబెల్లి దయాకర్రావు, సబితా ఇంద్రారెడ్డి రూపంలో ఏక్నాథ్ శిందేలను తయారు చేసింది కేసీఆర్ కాదా? ఇప్పుడు ఏక్నాథ్ శిందే బూతం కేసీఆర్ను పట్టుకుంది’’ అని రేవంత్రెడ్డి విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. -
‘క్రిటికల్ రివర్’ కంపెనీ వెనుక ఐటీ సలహాదారు శేషిరెడ్డి
క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ వెనక వైకాపావారు, ఐటీ సలహాదారు పాటూరి శేషిరెడ్డి ఉన్నారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ఆరోపించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తొలుత రూపొందించింది జగన్ ప్రభుత్వమే
దేశంలో తొలిసారిగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రూపొందించిందే జగన్ ప్రభుత్వం అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన బిల్లును కేంద్రం తిప్పి పంపినా మూడు సార్లు ఆమోదం కోసం పంపారని గుర్తుచేశారు. -
సీఎస్ను వెంటనే బదిలీ చేయాలి: రఘురామ
రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగాలంటే సీఎస్నూ వెంటనే బదిలీ చేయాలని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు డిమాండు చేశారు. -
రాముడిని ఆరాధించానని దాడి చేశారు
కాంగ్రెస్ను వీడిన రాధికా ఖేడా ఆ పార్టీ ఛత్తీస్గఢ్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాముడి భక్తురాలిని అయినందుకే తనపై దాడి చేశారని సోమవారం ఆమె మీడియాకు తెలిపారు.